మళ్ళీ వాయిదా పడ్డ సూర్య సినిమా..!

సూర్య నటించి నిర్మించిన సినిమా ‘పసంగ-2’.. తెలుగులో ‘మేము’గా వస్తున్న ఈ సినిమా ఎన్నో రోజుల నుండి రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తుంది. సూర్య కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ తో మేము ఆడియోని అయితే గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు అనువాద నిర్మాత జూలకంటి మధుసూధన్ రెడ్డి. అయితే కొద్దిరోజులుగా రిలీజ్ కష్టాలు పడుతున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ నెల 18 అదే శుక్రవారం రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

తీరా రిలీజ్ టైం దగ్గర పడుతున్న సమయంలో ఎందుకో సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు నిర్మాత మధుసూధన రెడ్డి. పాండిరాజ్ దర్శకత్వంలో చిన్న పిల్లల కథాశంతో వచ్చిన ఈ సినిమా తమిళంలో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధించింది. తమిళంలో సూర్య నిర్మాణ సారథ్యంలో వచ్చిన ఈ సినిమా ఇక్కడ కూడా సూర్య క్రేజ్ తోనే హిట్ కొట్టాలని చూస్తున్నారు.

అయితే ఈ శుక్రవారం ఇప్పటికే మరో 6 సినిమాలు రిలీజ్ అవుతుండటంతో మేము సినిమాను రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు దర్శక నిర్మాతలు. మరి పోటీ వద్దనుకున్నారో లేక మరేదైనా కారణాలో తెలియదు కాని ‘మేము’ సినిమా మళ్లీ వాయిదా పడటంతో సూర్య ఫ్యాన్స్ కాస్త ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. ట్రెండీ మూవీ సూర్య 24కు ముందు మేము సినిమాలో చూసి ఆనందిద్దామనుకుంటున్న అభిమానులకు ప్రస్తుతానికి మళ్ళీ నిరాశే మిగిలింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close