కోట్ల , కేఈ – ఎవరు బీజేపీలోకి? ఎవరు టీడీపీ లోనే?

తెలుగు రాష్ట్రాల్లో బలపడాలి అన్న మిషన్ తో పని చేస్తున్న బీజేపీ వ్యూహకర్తలు అందుకు సహకరించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులని ఇప్పటికే కొంతమందిని పార్టీలో చేర్చుకున్న బీజేపీ ఇప్పుడు కర్నూలు జిల్లా మీద దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం కానీ మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబం కానీ త్వరలోనే బీజేపీ లో చేరే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయవర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వర్గానికి మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వర్గానికి ఎప్పటి నుండో ఆ రాజకీయ వైరం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు అన్నీ తెలిసి కూడా కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్టు, ఇద్దరు నేతలు ఒకే పార్టీలో కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ అధికారం ఉంటే అది వేరే సంగతి కానీ అధికారం లేక పోతే వీరిద్దరిని ఒకే ఒర లో ఉంచడం చాలా కష్టం. బహుశా ఇది తెలిసి బీజేపీ పెద్దలు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ని తమ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే కోట్ల ఏ విషయము తేల్చకపోవడంతో బీజేపీ పెద్దలు కెఈ కృష్ణమూర్తి తో కూడా సంప్రదింపులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చంద్రబాబు కి ముందు చాలా గడ్డుకాలం ఉందని , తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుందని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఒక మైండ్ గేమ్ కు తెరతీశారు. దీంతో చాలా మంది టీడీపీ నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కేఈ కృష్ణమూర్తి లాంటి వారిలో కూడా రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన ఉండటం సహజమే. ఆ ఆందోళనని ఆసరా చేసుకుని బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నారు.

ఇద్దరిలో ఎవరు బీజేపీ వలకు చిక్కుతారు అన్నది ప్రస్తుతానికి కర్నూలు జిల్లాలో సస్పెన్స్ గా మారింది. అయితే ఇద్దరిలో ఎవరు ముందుగా బీజేపీ లోకి వెళ్ళినా, రెండవ వారు బీజేపీలోకి వెళ్లే ప్రతిపాదనను విరమించు కొనే అవకాశం కనిపిస్తోంది. దీంతో, ఎవరు బీజేపీలోకి వెళతారో ఎవరు తెలుగు దేశం పార్టీ లోనే కొనసాగుతారో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close