కోట్ల , కేఈ – ఎవరు బీజేపీలోకి? ఎవరు టీడీపీ లోనే?

తెలుగు రాష్ట్రాల్లో బలపడాలి అన్న మిషన్ తో పని చేస్తున్న బీజేపీ వ్యూహకర్తలు అందుకు సహకరించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులని ఇప్పటికే కొంతమందిని పార్టీలో చేర్చుకున్న బీజేపీ ఇప్పుడు కర్నూలు జిల్లా మీద దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం కానీ మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబం కానీ త్వరలోనే బీజేపీ లో చేరే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయవర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వర్గానికి మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వర్గానికి ఎప్పటి నుండో ఆ రాజకీయ వైరం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు అన్నీ తెలిసి కూడా కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్టు, ఇద్దరు నేతలు ఒకే పార్టీలో కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ అధికారం ఉంటే అది వేరే సంగతి కానీ అధికారం లేక పోతే వీరిద్దరిని ఒకే ఒర లో ఉంచడం చాలా కష్టం. బహుశా ఇది తెలిసి బీజేపీ పెద్దలు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ని తమ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే కోట్ల ఏ విషయము తేల్చకపోవడంతో బీజేపీ పెద్దలు కెఈ కృష్ణమూర్తి తో కూడా సంప్రదింపులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చంద్రబాబు కి ముందు చాలా గడ్డుకాలం ఉందని , తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుందని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఒక మైండ్ గేమ్ కు తెరతీశారు. దీంతో చాలా మంది టీడీపీ నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కేఈ కృష్ణమూర్తి లాంటి వారిలో కూడా రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన ఉండటం సహజమే. ఆ ఆందోళనని ఆసరా చేసుకుని బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నారు.

ఇద్దరిలో ఎవరు బీజేపీ వలకు చిక్కుతారు అన్నది ప్రస్తుతానికి కర్నూలు జిల్లాలో సస్పెన్స్ గా మారింది. అయితే ఇద్దరిలో ఎవరు ముందుగా బీజేపీ లోకి వెళ్ళినా, రెండవ వారు బీజేపీలోకి వెళ్లే ప్రతిపాదనను విరమించు కొనే అవకాశం కనిపిస్తోంది. దీంతో, ఎవరు బీజేపీలోకి వెళతారో ఎవరు తెలుగు దేశం పార్టీ లోనే కొనసాగుతారో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close