టిఏజిసి 2020 సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలు

చికాగో, ఫిబ్రవరి 2: మొట్టమొదటి తెలుగు సంస్థ అయిన చికాగో మహానగర తెలుగు సంస్థ (టిఏజిసి) ఆధ్వర్యంలో సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలు హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో వారి ఆడిటోరియంలో ఫిబ్రవరి 1 న మధ్యాహ్నం 2:30 ప్రారంభమై రాత్రి 10:00 వరకు చాలా ఘనంగా నిర్వహించారు.


ఈ కార్యక్రమాన్ని గణపతి ప్రార్థనతో సంస్థ అధ్యక్షులు శ్రీ ప్రవీణ్ వేములపల్లి & శ్రీమతి క్రాంతి వేములపల్లి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీ వెంకట్ గూనుగంటి, ముఖ్యకార్యదర్శి శ్రీ అంజిరెడ్డి కందిమళ్ల, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి వినీత ప్రొద్దుటూరి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.

శ్రీమతి నీలిమ ఛేకీచర్ల మరియు అలంకరణ సభ్యులు ముఖద్వారం, నృత్య వేదికను సంక్రాంతి, గణతంత్ర దినోత్సవ ప్రతిమలతో సుందరంగా అలంకరించారు. నృత్యవేదిక ముందు బొమ్మల కొలువును చాలా చక్కగా ఏర్పాటు చేసారు. పిల్లలకు పతంగుల తయారీ పోటీ నిర్వహించి బహుమతులను ప్రధానం చేసారు.

శ్రీ అంజిరెడ్డి కందిమళ్ల, కోశాధికారి శ్రీ పాండురంగారెడ్డి లెంకల, కో-కోశాధికారి శ్రీ రమణ కాల్వ మరియు శ్రీ పరమేశ్వర యరసాని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శ్రీమతి ఉమా అవధూత మరియు ఇతర మహిళా వాలంటీర్లు ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగు ఆడపడుచులను సాంప్రదాయబద్ధంగా బొట్టుపెట్టి పన్నీరు చిలకరించి ఆహ్వానించారు. ఈ వేడుకల్లో దాదాపు 1500 మంది సభ్యులు మరియు
అతిథిలు పాల్గొన్నట్లు సంస్థ సభ్యత్వ నమోదు కార్యదర్శి శ్రీ పరమేశ్వరరెడ్డి యరసాని తెలిపారు.

తెలుగు సాంప్రదాయినికి ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత తెలిపే బాలుర నృత్యప్రదర్శన, రైతుల ప్రాముఖ్యాన్ని మరియు వారి కష్టాలను వివరించే ‘జైకిసాన్’ పర్యావరణ ప్రాముఖ్యాన్ని చాటిచెప్పే “వనం” కార్యక్రమం, ప్రస్తుత సమాజంలో మహిళల ఎదుర్కొంటున్న సమస్యలను వాటిని ఎలా ఎదుర్కోవాలో వివరించే ‘విమెన్ఎంపవర్మెంట్’ నాటిక, గణతంత్ర దినోత్సవం మరియు వివిధ చిత్రగీతాల మాలిక ‘చిత్రలహరి’ ప్రోగ్రాం, చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం మరియు మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. 32 టీంల ద్వారా 350 ప్రదర్శనకారులు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని, ప్రదర్శనకారులకు టిఏజిసి తరుపున సర్టిఫికెట్స్, వినూత్నంగా పర్యావరణ ప్రాముఖ్యాన్ని తెలిపే విధంగా మొక్కలను టీం కో-ఆర్డినేటర్స్ కు అందజేశామని సంస్థ సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి వినీత ప్రొద్దుటూరి తెలిపారు.

ఈ కార్యక్రమాలను విజయవంతం చేయటానికి రెండు నెలలుగా శ్రమించిన కల్చరల్ కో-చైర్స్ శ్రీమతి శిరీష మద్దూరి, శ్రీమతి మాధవిరాణి కొనకళ్ల, శ్రీమతి శిల్ప పైడిమర్రి, శ్రీ శ్రీకాంత్బేతి మరియు కూర్పుకర్తలు, సమన్వయకర్తలుకు ధన్యవాదములు తెలిపారు.


ఈ ఉత్సవానికి విచ్చేసిన అతిథులకు వడ్డించటానికి సంక్రాంతి పండుగ పిండివంటలైన నేతి అరిసెలు, చెక్కినాలుతోపాటు ఉలవచారు, వడియాలు, చల్ల మిరపకాయలు తెలుగు రాష్ట్రాలనుంచి ప్రత్యేకంగా తెప్పించామని మరియు వీటితో పాటుగా వివిధ రకాలైన ఆహారాలను బావార్చి రెస్టారెంట్ Naperville వారు సమకూర్చారని, కొన్ని వంటకాలను మట్టి కుండలలో పెట్టి వడ్డించామని, విందు భోజనం చాలా రుచికరంగా ఉందని, భోజనశాల అలంకరణ చాలా బాగుందని అతిథులు ప్రశంసించారని ఫుడ్ కమిటీ కార్యదర్శి శ్రీ సంతోష్ కొండూరి తెలిపారు. ఆహార ఏర్పాటులను పర్యవేక్షించిన యూత్కార్యదర్శి శ్రీ విజయ్బీరం, శ్రీ వెంకట్గూనుగంటి, శ్రీ శశి చావా, శ్రీ నవీన్ఎడుమ, శ్రీ రోహిత్ఆకుల, శ్రీ శ్రీధర్అలవల మరియు వాలంటీర్లుకు శ్రీ సంతోష్ కృతఙ్ఞతలు తెలిపారు.

ఈరోజు జరిగిన కార్యక్రమాలను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఫోటోలు, లైవ్ వీడియోల రూపంలో ప్రదర్శించటం జరిగిందని, మరిన్ని ఫోటోలు, వీడియోలను https://www.tagc.org/photos.php వెబ్సైటు ద్వారా చూడవచ్చని మీడియా కార్యదర్శి శ్రీ శ్రీధర్అలవల తెలిపారు.

ఇల్లినాయిస్ స్టేట్ మెడికల్ డిసిప్లినరీ బోర్డుకు ఇల్లినాయిస్ గవర్నర్ నీయమించిన తెలుగు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని సన్మానించటం జరిగినది. ఈ కార్యక్రమంలో డొనేషన్ ద్వారా సేకరించిన నిధులను టిఏజిసి నెల్లూరుకి చెందిన విశ్వభారతి బ్లైండ్స్కూల్కి విరాళంగా అందించింది. విశ్వభారతి బ్లైండ్ స్కూల్ అంధులు అయినా అనాధ బాలబాలికలను దరిచేర్చి వారికీ సహాయ సహకారాలు అందించే ఒక స్వచ్చంద సంస్థ.

రెండు చేతులు లేనిదే చప్పెటలు మ్రోగవు, నలుగురు లేనిదే సభని అలంకరించలేము అలాగే కొన్ని కుటుంబాలు కలవనిదే ఒక పండుగ పూర్తికాదు. ఈ రోజు మన ఈ సంక్రాంతి పండుగ సంబరాలని వెయ్యి రేట్లు అద్భుతంగా మరియు కన్నులపండుగగా తీర్చిదిద్ది విజయవంతం చెయ్యటానికి సహాయసహకారాలు అందించిన దాతలకు, కళాకారులకు, కళాఅభిమానులకు ,కళాపోషకులకు , కూర్పుకర్తలు , సమన్వయకర్తలు ,కార్యకర్తలకు ,కార్యవర్గసభ్యులకు ,మిత్రులకు ,శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు అధ్యక్షులు శ్రీ ప్రవీణ్ వేములపల్లి ధన్యవాదములు తెలిపారు. జాతీయ గీతాలాపనతో కన్నులపండుగగా జరిగిన ఈ కార్యక్రమం ముగిసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close