తమ్మినేని “స్పీకింగ్” స్టైల్ ఊరమాస్ మరి..!

అమరావతి రాజధానిలో టీడీపీకి ప్రపంచ స్థాయి నగరం కనిపించింది. వైసీపీకి స్మశానం కనిపించింది. మరి రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి.. అక్కడే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు మరింత విభిన్నంగా.. అక్కడ రాజస్థాన్ ఎడారి కనిపించింది. తమ్మినేని అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్నప్పుడు.. రాజస్థాన్ ఏడారిలో వెళ్తున్నట్లుగా ఫీలయ్యారు. ఆ విషయాన్ని ఆయనే చెప్పారు. ఆయనకు అంత వేడిగా.. ఏడారిలా ఎందుకు అనిపించిందో కానీ… నిర్మోహమాటంగా బయట పెట్టేశారు. అంతే కాదు.. చాలా మందికి అలాగే ఉందని.. కాను తాను మాత్రం… బయట పడుతున్నానని చెప్పుకొచ్చారు. రాజధాని అంటే అందరూ గర్వించేలా ఉండాలి కానీ.. అమరావతిలా ఉండకూడదన్నారు.

తమ్మినేని వ్యాఖ్యలు సహజంగానే … అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఎందుకంటే.. అమరావతిని మార్చాలనుకున్నప్పటి నుంచి వైసీపీ నేతలంతా… వరుసగా.. అమరావతిపై అలాంటి ముద్రలే వేస్తున్నారు. అందులో ఓ కులానికి సంబంధించిన దగ్గర్నుంచి అన్న కోణం దగ్గర్నుంచి వరద ముంపు వరకూ చాలా కోణాలున్నాయి. అయితే.. మంత్రులు.. ముఖ్యమంత్రి.. ఇతర నేతలు అలాంటి విమర్శలు చేస్తే.. ఎవరైనా రాజకీయం అనుకుంటారు కానీ.. ఏ పదవిలో ఉండి రాజకీయ విమర్శలు చేయకూడదో… ఆ పదవిలో ఉండి మాట్లాడటం వల్లే తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు హైలెట్ అవుతున్నాయి.

అమరావతి రాజస్థాన్ ఏడారో.. థార్ ఏడారో కావొచ్చు.. కానీ అది ఆంధ్రప్రదేశ్‌లో భాగమే. అయినప్పటికీ.. ఆ ప్రాంతాన్ని కించ పరిచేలా.. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడటమే… చాలా మందికి ఆశ్చర్యకరం. కానీ.. ప్రస్తుతం రాజధాని అమరావతికి అంత మంచి రోజులు కావు. అందుకే… స్మశాననం దగ్గర్నుంచి ఎడారి వరకూ.. అన్ని బిరుదులు పొందుతూ ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close