తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారో క్లారిటీకి తెచ్చుకున్నారు. తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని వారికి తెలుసో లేదో కానీ.. ట్యాపింగ్ కు గురయినట్లుగా అనుమానం ఉన్న అందర్నీ పిలిచి స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు. అయితే రాజకీయ నేతలు ఓకే.. మరి సినీ తారలసంగతేమిటి అన్న ప్రశ్న వస్తోంది.
సినీతారల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. స్వయంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఫోన్ ట్యాపింగ్ తో సినీ తారల కుటుంబంలో చిచ్చు పెట్టారని ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కు కేసీఆర్, కేటీఆర్ కు ఎవరిచ్చారని.. ప్రైవసీని దెబ్బతీసే హక్కు ఎవరిచ్చారని ఆయన ప్ఱశ్నించారు. సినీ తారల ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే వారి వద్ద నుంచి కూడా స్టేట్మెంట్లు తీసుకోవాలి కదా అన్న సందేహం చాలా మందికి వస్తోంది.
బీజేపీ నేతల నుంచి స్టేట్ మెంట్లు తీసుకున్నారు. కాంగ్రెస్ నేతల నుంచి తీసుకున్నారు. బీఆర్ఎస్ నేతల్ని కూడా బిలవబోతున్నారు. మీడియాలో.. వేమూరి రాధాకృష్ణ ఫోన్ కూడా ట్యాప్ అయినట్లుగా గుర్తించారు. ఆయన స్టేట్ మెంట్ కూడా రికార్డు చేస్తున్నారు. సమరి సినీతారలది ఎందుకు చేయడం లేదు ?. ఈ విషయంలో పోలీసులు గుంభనంగా వ్యవహరిస్తున్నారని.. ట్యాపింగ్ కు నెంబర్లను బట్టి వారి వద్ద సైలెంట్ గా స్టేట్ మెంట్లు తీసుకుంటున్నారు. తమ ఫోన్లు ట్యాప్ అయినట్లుగా బయటకు రావొద్దని.. వారు కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే సాక్షుల వివరాలను కోర్టులో ప్రవేశ పెట్టినప్పుడయినా బయటకు రావడం ఖాయమని అనుకోవచ్చు.