పవన్‌పై స్పందించొద్దని పార్టీనేతలకు టీడీపీ నాయకత్వం సూచన

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ సోమవారం చేసిన వ్యాఖ్యలపై స్పందించగూడదని తెలుగుదేశంపార్టీ నాయకత్వం తమ నాయకులకు, శ్రేణులకు సూచించింది. టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. పవన్ టీడీపీకి శ్రేయోభిలాషి అని, తమకు సాయంచేసిన ఆయనను తాము గౌరవిస్తామని అన్నారు. సెక్షన్ 8పై ఆయన అభిప్రాయం వ్యక్తిగతమని, ఆయనతో తమకు విబేధాలు లేవని గాలి చెప్పారు. మరోవైపు, అనకాపల్లి ఎంపీ, టీడీపీ నాయకుడు అవంతి శ్రీనివాసరావు, పవన్‌ పార్లమెంటుకు రావాలనుకుంటే తాను అనకాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేస్తానని అన్నారు. పవన్ కల్మషంలేని వ్యక్తి అని, తానుకూడా ఆయన అభిమానినేనని చెప్పారు. సమాచారలోపంవలనే ఆయన సీమాంధ్ర ఎంపీలపై విమర్శలు చేశారని శ్రీనివాసరావు అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close