ఎదురుదాడికి దిగిన తెలుగుదేశం

హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ నేతలు ప్రభుత్వంపై ఇంతకాలంగా ఎన్ని విమర్శలు చేసినా మాట్లాడని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎదురుదాడికి దిగింది. విజయవాడ తెలుగుదేశం విజయవాడ అర్బన్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బీజేపీ ఎమ్మెల్యే సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావు, పురందేశ్వరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వెంకన్న ఎదురుదాడికి చంద్రబాబు ఆమోదం ఉందో, లేదో ఇంకా తెలియటంలేదు.

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు కొంతకాలంగా టీడీపీపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. నిన్నకూడా కన్నా, కావూరి, సోము వీర్రాజు అనంతపురంలో పర్యటిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం బలహీనపడిపోయిందని, అవినీతి పెరిగిపోయిందని విమర్శలు చేశారు. భవిష్యత్తు బీజేపీదే అన్నారు. దీనిపై ఇవాళ టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి చంద్రబాబు భిక్ష అని, ఆయన మంత్రిపదవికోసమే ఈ విమర్శలు చేస్తున్నారని బుద్దా వెంకన్న అన్నారు. ఎన్నికల సమయానికి కాంగ్రెస్ గూటికి చేరతారని చెప్పారు. పురందేశ్వరి ఎన్‌టీఆర్ కుమార్తె అని చెప్పుకోటానికి తాము సిగ్గుపడుతున్నామని అన్నారు. వారాలు చేసుకుని బతికిన కావూరి వందల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. కన్నా లక్ష్మీనారాయణ సున్నా లక్ష్మీనారాయణ అయిపోయారని అన్నారు. కావూరి, కన్నా, పురందేశ్వరి సోనియా గాంధి ఏజెంట్‌లని ఆరోపించారు. బీజేపీ అగ్రనేతలు వీరిపై దృష్టి పెట్టాలని అన్నారు. చంద్రబాబు చరిష్మావల్లే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. బాబుకు మచ్చ తెచ్చేలా మాట్లాడితో సహించబోమని వెంకన్న హెచ్చరించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close