ఆలు లేదు చూలు లేదు…కొడుకు పేరు సోమలింగం

ఆలు లేదు చూలు లేదు…కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది ఆంధ్రప్రదేశ్ ఎంపిల గొడవ. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా మొన్న విజయవాడలోని రైల్వే కల్యాణ మండపంలో తెదేపా ఎంపిలతో సమావేశమయినపుడు వారి మధ్య రైల్వే జోన్ ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై గొడవ జరిగింది.

రైల్వే జోన్ ఏర్పటుపై చర్చ జరుగుతునప్పుడు, నర్సారావుపేట తెదేపా ఎంపీ రాయపాటి సాంభశివరావు “తుఫానులు వరదలు సంభవించే విశాఖ నగరంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం కంటే గుంటూరులో ఏర్పాటు చేస్తే మంచిదని” అన్నప్పుడు దానికి అనకాపల్లి ఎంపీ ఆవంతి శ్రీనివాస్, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్ర అభ్యంతరం తెలిపారు. “అదే కారణంగా అయితే కృష్ణా జిల్లాలో కూడా పెను తుఫానులు సంభవిస్తుంటాయని, అంత మాత్రాన్న రాజధానిని అక్కడ నిర్మించరాదని ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు కదా?” అని ప్రశ్నించారు. విశాఖలో రైల్వే జోన్ కోసం ఉత్తరాంద్ర ప్రజలు చిరకాలంగా డిమాండ్ చేస్తున్నారని, రైల్వే జోన్ ఏర్పాటు అనేది విశాఖ ప్రజల సెంటిమెంటుతో ముడిపడుందని కనుక దానిని అక్కడి నుండి వేరే చోటికి తరలించుకుపోవాలని ఎవరయినా ప్రయత్నిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా రైల్వే జోన్ ఏర్పాటు చేసే ఆలోచననే రైల్వే శాఖ విరమించుకొందని ఇంతకు ముందు మీడియాలో వార్తలు వచ్చేయి. కానీ వారు ఆ సంగతి మరిచిపోయినట్లు రాని రైల్వే జోన్ ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై వాదోపవాదాలు చేసుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎంపిలు అందరూ కలిసి రైల్వే జోన్ ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారు? అసలు ఏర్పాటు చేసే ఉద్దేశ్యం ఉందా లేదా? అని ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తాని నిలదీసి ఉండాల్సింది. కానీ ఆ పని చేయకుండా ఈ విధంగా వాదోపవాదాలు చేసుకొని తమ ప్రభుత్వానికే కొత్త సమస్యలు సృష్టించుకొంటున్నారు.

ఎంపి జేసీ దివాకర్ రెడ్డి ఈ సమావేశంలో రవీంద్ర గుప్తాని సరిగ్గా నిలదీసారని చెప్పవచ్చును. దక్షిణ మధ్య రైల్వేల అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇమ్మని రవీంద్ర గుప్తా ఎంపిలని కోరినప్పుడు, “ఇదివరకు ఆమోదించిన ప్రాజెక్టులనే చేపట్టకుండా, వాటికి కేటాయించిన నిధులను మంజూరు చేయకుండా మళ్ళీ కొత్తగా సలహాలు అడగడం దేనికి? మా సలహాలు అమలుచేయనప్పుడు మళ్ళీ సలహాలు అడగడం దేనికి?” అని గట్టిగా నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపిలు అందరూ అంత గట్టిగా మాట్లాడగలిగినపుడే రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆ పని చేయకుండా ఆకాశంలో మబ్బులు చూసి కుండలో నీళ్ళు బయట పారబోసుకొన్నట్లుగా, వస్తుందో రాదో తెలియని రైల్వే జోన్ కోసం కీచులాడుకోవడం చాలా అవివేకమేనని చెప్పక తప్పదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close