తెదేపా ఎంపీల ధర్నా పవన్ కళ్యాణ్ కోసమేనా?

“ఆంధ్రా ఎంపీలకి తమ వ్యాపారాల మీద ఉన్నంత శ్రద్ద ప్రత్యేక హోదా సాధించడంపై లేదు. మనోళ్ళకి మోడీ అంటే చాలా భయం. అందుకే నోరుమెదపకుండా కూర్చొని పార్లమెంటు గోడలని చూస్తూ కాలక్షేపం చేసి వచ్చేస్తుంటారు. మనోళ్ళ కంటే తెలంగాణా ఎంపీలే చాలా నయం. వారి రాష్ట్రం కోసం పార్లమెంటులో గట్టిగా పోరాడుతుంటారు.” ఈ మాటలు ఎవరన్నారో అందరికీ తెలుసు. బహుశః ఆ దెబ్బకి జడిసిన తెదేపా ఎంపీలు గురువారం మధ్యాహ్నం పార్లమెంటు ఆవరణలో గాంధీజీ విగ్రహం దగ్గర ప్లకార్డులు పట్టుకొని ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయాలని, విభజన బిల్లులో ఉన్న హామీలన్నిటినీ అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేసారు.

‘పోనీలే ఇన్నాళ్ళకు మనోళ్ళు దైర్యంగా నోరువిప్పి మనకి కావలసిందేమిటో చెప్పారు’ అని రాష్ట్రంలో జనాలు సంతోషపడుతుంటే, జేసీ దివాకర్ రెడ్డి రెండు పంచ్ డైలాగులతో గాలి తీసేశారు. దేని గురించయినా నిర్భయంగా కుండలు బ్రద్దలు కొట్టి చెప్పేసే అలవాటున్న జెసి తమ ధర్నా గురించి మరో కుండ బ్రద్దలేసేసారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “ఇటువంటి ధర్నాల వలన ఏమీ ప్రయోజనం ఉండదని మాకు తెలుసు. కానీ ఏదో ప్రజలని ఊరడించడానికి, పవన్ కళ్యాణ్ న్ని చల్లబరచడానికే ఇది ఉపయోగపడుతుంది,” అని మనసులో మాట బయట పెట్టేశారు. దానితో తెదేపా ఎంపీలు ధైర్యం చేసి ధర్నా చేసినా వ్రతం చెడినా ఫలం దక్కనట్లయింది.

కానీ ఇక్కడ మరో విషయం చెప్పుకోక తప్పదు. ఓ నాలుగయిదు రోజుల క్రితమే కేంద్రమంత్రి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ, “ప్రత్యేక హోదాకి సంబంధించి దాదాపు 60 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు కూడా మరొక నెల్లన్నరలోగా పూర్తయ్యే అవకాశాలున్నాయి. కనుక అప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా గురించి తన నిర్ణయం ప్రకటించవచ్చును. రైల్వే జోన్ మంజూరు చేయడానికి కొన్ని ఆర్ధిక అవరోధాలు ఎదురవుతున్నాయి. కానీ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తరువాత కేంద్రమంత్రి వర్గ సమావేశంలో రాష్ట్రానికి రైల్వే జోన్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవచ్చును,” అని తెలిపారు. అంటే ఈరోజు ధర్నా చేసిన తెదేపా ఎంపీలందరికీ కూడా ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది. కానీ ధర్నా చేసారంటే? దివాకర్ రెడ్డి చెప్పిందే నిజమనుకోవాలి మరి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close