2 జి పై టిడిపి వైసీపీ స్పందనలు

దేశంలో ఎక్కడ ఏ పరిణామం జరిగినా ఎపికి వర్తింపచేయడం, వైసీపీ టీడీపీలు రకరకాలుగా స్పందించడం పరిపాటిగా మారింది. దేశాన్ని కుదిపేసిన 2జి కేసులో నిందితులైన కనిమొళి,రాజా తదితరులను సిబిఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించడంపైనా ఇదే తంతు. ఈ తీర్పు వస్తుండగానే ఒక టిడిపి నాయకుడు సుప్రీం కోర్టు 2జి కేటాయింపులు రద్దు చేస్తే కింద కోర్టు ఇలాటి తీర్పు ఇవ్వడమేమిటని ఆక్షేపించారు. చంద్రబాబు నాయుడుపై ఎపిహైకోర్టులోనే వేర్వేరు జడ్జిలు వేర్వేరుగా ఆదేశాలు తీర్పులు ఇచ్చిన సంగతి నేను గుర్తు చేశాను. ఇంతకూ ఏ కేసులోనైనా తప్పును నిర్ధారించడం వేరు, దానికి కారణమైన దోషులను నిర్ణయించడం వేరు. కాగ్‌ నివేదికలో 1,70వేల కోట్ల నష్టం వచ్చినట్టు నివేదిస్తే సిబిఐ చార్జిషీటులో 30 వేల కోట్ల నష్టం మాత్రమే చూపించారు. దానిపై విచారణలో మాజీ కేంద్ర మంత్రి రాజా స్వయంగా వాదించారు. తనొక్కడే గాక ప్రధాని మన్మోహన్‌తో సహా సమిష్టిగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. చివరకు కోర్టు కేసు కొట్టి వేసింది. దీని ప్రభావం జగన్‌ కేసులపై ఎలా వుంటుందని నన్ను ఒక ఛానల్‌ వారు అడిగారు. ఈ రెండు కేసులలో చాలా తేడాలున్నా ఒక పోలిక వుంది. ప్రభుత్వం వల్ల అక్రమంగా లబ్దిపొందిన వారు అధినేతలకు సంబంధించిన వారి సంస్థల్లో పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణ ఒక్కటే. 2జిలో వచ్చిన విపరీత లాభంతోనే కనిమొళి ఆధ్వర్యంలోని కళైంగార్‌ టీవీలో 200 కోట్లు పెట్టారనేది అక్కడ ఆరోపణైతే భూములు పొందిన వారు సాక్షిలో పెట్టారనేది ఇక్కడ అభియోగం. అక్కడ కనిమొళి లాగే ఇక్కడ జగన్‌ కూడా జైలులో వుండివచ్చారు. వచ్చిన తర్వాత ఎన్నికల్లో భారీగా స్తానాలు పొందారు. కేసు విచారణ సాగుతూనే వుంది గాని నిర్ధారణలు జరిగింది లేదు. మధ్యలో ఇడి ఆస్తుల స్వాధీనాలు కూడా జరిగాయి. మరోవైపున ఐఎఎస్‌లు కొందరు విముక్తి పొందారు. ఇప్పుడు 2 జి తీర్పు వెలుగులో తమ నాయకుడు కూడా బయిటపడతారని వైసీపీ నేతలు కొందరు అంటున్నారు. నిజంగా ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. కాని 2జి కేసు కొట్టివేత వైసీపీకి వూరటగా వున్నట్టు కనిపిస్తుంది. అప్పట్లో అవినీతిపై సమరం చేసిన అన్నా హజారే కూడా కోర్టు చెప్పాల్సిందే చెప్పిందని వ్యాఖ్యానించారు.ఇక మాజీ ప్రధాని మన్మోహన్‌ అయితే కేసులో అంతా అవాస్తవారోపణలు చేసినట్టు తేలిపోయిందన్నారు. అప్పటి సిఎజి వినోద్‌ రారు కావాలని చేశారని కేసు వాదించిన కపిల్‌ సిబాల్‌ చెప్పారు.ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాత్రం ఈ తీర్పును నిజాయితీకి కితాబులాగా చూడొద్దని చురక వేశారు. జాతీయ స్పందనలు ఎలా వున్నా వైసీపీ టీడీపీల మధ్య మాత్రం షరా మామూలుగా మాటల యుద్దం మొదలవుతున్నది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close