తెలకపల్లి రవి : చెప్పే సీట్లలెక్కలో వచ్చేది సగమే- పార్టీల ఒప్పుకోలు

తెలంగాణలో ఎవరు అధికారంలోకి వస్త్తారన్నది ఇప్పుడు ఎవరు కలిసినా అడిగే ప్రశ్న. ముఖ్యమంత్రి కెసిఆర్‌ తాను చాలా సర్వేలు చేయించానని 90 నుంచి 100 వరకూ వస్తాయని వివిధ దశల్లో చాలాసార్లు చెప్పారు.వారి మీడియాలోనూ అలాటి ప్రచారమే సాగుతున్నది. కాని టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు మాత్రం అంతర్గతంగా మాట్లాడినప్పుడు అంత సీన్‌ లేదంటున్నారు. ఎలాగైనా అధికారంలోకి వస్తామని, ఇప్పుడున్న 60+ నిలబెట్టుకుంటామని వారంటున్నారు. ఒకవేళ యాభై వచ్చినా మజ్లిస్‌, బిజెపి తమకు మద్దతిస్తాయని టిఆర్‌ఎస్‌ భావిస్తున్నది. అలా చూస్తే ఖచ్చితంగా లెక్క వేసుకుంటున్నది యాభై మాత్రమే. మహాకూటమి తరపున చంద్రబాబు ఎక్కువగా ప్రచారం చేస్తే తమకు మంచిదని అప్పుడు ఆయనపై వ్యతిరేకత రెచ్చగొట్టి తమ ఓట్లు సీట్లు పెంచుకోవచ్చని టిఆర్‌ఎస్‌ ఆశిస్తున్నది.

తమాషా ఏమంటే కాంగ్రెస్‌ పరిస్థితి కూడా ఇలాగే వుంది. కనీసం తమకు 40 మిత్రులకు మరో 15 వస్తాయని కాంగ్రెస్‌ వారు చెబుతుంటారు. అయితే నిశితంగా ప్రశ్నిస్తే ఆలస్యం, అనైక్యత వంటి కారణాలు చూపించి ఎలాగో 25 సీట్లతో గతంలో కన్నా కొద్దిగా పెరుగుతామని అంటున్నారు. టిజెఎస్‌కు అసలే నమ్మకం లేదు. టిడిపి మాత్రం బలమైన సీట్లు వస్తే 6 లేదా 7 తెచ్చుకోగలమంటుంది. బిజెపి 60+ అనడం జోక్‌గా తీసుకుంటున్నారు. రెండుమూడు చోట్ల మాత్రం ఎలాగో టిఆర్‌ఎస్‌ వారే బిజెపిని గెలిపించే బాధ్యత తీసుకున్నారు.ముషీరాబాద్‌లో బిజెపి లక్ష్మణ్‌ కోసమే హోంమంత్రి నాయని అల్లునికి లేదా ఆయనకు టికెట్‌ నిరాకరించారన్నది జనవాక్యం. ఇక సిపిఎం బిఎల్‌ఎప్‌లు అన్ని చోట్టా పోటీ చేస్తామంటున్నా గెలిచే స్థానాల సంఖ్యపై పెద్దగా ఆశలు కల్పించడం లేదు. మజ్లిస్‌కు గతంలో వచ్చిన ఏడు కన్నా ఎక్కువగా వస్తాయా అంటే అదే గరిష్టమనీ, మహా కూటమి కొన్నిచోట్ల వారి ఓట్టు చీల్చవచ్చని పరిశీలనలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close