తెలకపల్లి రవి : వైవీ సుబ్బారెడ్డి పిటిషన్‌ పొరబాటు గనకనే…

తనపై హత్యాప్రయత్నానికి సంబంధించిన దర్యాప్తులో ఎపి పోలీసులపై నమ్మకం లేదు గనక మూడవ పక్షంతో చేయించాలని వైసీపీ అద్యక్షుడు జగన్మోహనరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానికి ముందు ఆ పార్టీ మాజీ ఎంపి వైవీ సుబ్బారెడ్డి కూడా ఇలాటి పిటిషనే వేసి వున్నారు. ఆ తర్వాత ఆయనతో సహా ఆ పార్టీ బృందం ఢిల్లీ వెళ్లి హొం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి దర్యాప్తు చేయాలని కోరి వచ్చారు. కేంద్రం జోక్యం కోరడమేమిటి కావాలంటే కోర్టుల సహాయం కోరవచ్చునని నేను అదే రోజు సాక్షి చర్చలో అన్నాను. హైకోర్టులో కూడా పిటిషన్‌ వేశారని చర్చ నిర్వహిస్తున్న అమర్‌ చెప్పారు. అయితే తర్వాత తెలిసిందేమంటే అప్పటికి వేసిన పిటిషన్‌ సరికాదట. ఇలాటి దాడి ఘటనల్లో బాధితుడు తప్ప బయిటవారు వేస్తే చెల్లదట. వైవీ సుబ్బారెడ్డి పేరుతో వేసిన దాన్ని కోర్టు స్వీకరించే అవసరం లేదని తేలడంతో జగన్‌ స్వయంగా పిటిషన్‌ వేశారు. కేంద్రం జోక్యమే గాక న్యాయవ్యవస్థను కూడా ఆశ్రయించామని చెప్పడానికి కూడా ఇది ఉపయోగకరమని భావించి వుండొచ్చు. విమానాశ్రయంలో భద్రతా లోపం వల్లనే జగన్‌పై దాడి జరిగినట్టు,సిబిఐతో విచారణ జరిపించాలని కోరుతూ గుంటూరుకు చెందిన అనిల్‌ కుమార్‌ రెండు రోజుల కిందట ఒక ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్‌) కూడా దాఖలు చేశారు. ఇప్పుడు హైకోర్టు ఈ రోజున జగన్‌ పిటిషన్‌ స్వీకరించింది గాని ఈ మూడింటిని కలిపి మంగళవారం విచారించాలని నిర్ణయించింది. మరి తుది ఆదేశాలు ఎలా వుంటాయో తెలియదు. దాడి ఘటన తీవ్రతపైన, పోలీసుల తీరుపైన, రాజకీయ పార్టీల ఆరోపణలపైన హైకోర్టు ఏదైన వ్యాఖ్యానించే అవకాశముంది. ముందే సందేహాలు ఎందుకని ఏదైనా జరిగితే అప్పుడే రావాలని కూడా చెప్పొచ్చు. అలాగాక కొన్ని కేసుల్లో వలె రాష్ట్ర పోలీసుల తీరును తప్పుపట్టొచ్చు కూడా. ఏవైనా ఆదేశాలతో మరోసారి విచారణ వాయిదా వేసినా ఆశ్చర్యం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close