బతిమాలి టిక్కెట్లు ఇస్తారని బెట్టు చేస్తున్న టీ బీజేపీ సీనియర్లు!

దరఖాస్తు చేసుకోకపోతే టిక్కెట్ ఇవ్వరా అని.. హైకమాండ్ తోనే జోకులేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు. నిజంగా వారు తమ నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి లేదు.అయినా సరే వారు మాకు కాక ఇంకెవరికి టిక్కెట్ ఇస్తారన్నట్లుగా ఉన్నారు. అందుకే టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కౌంటర్లు తెరిచినా ఎవరూ దరఖాస్తు చేసుకోవడం లేదు. కింది స్థాయి నేతలు వచ్చి దరఖాస్తులు చేసుకుంటున్నారు.

దరఖాస్తు చేసుకున్న వారికే టిక్కెట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడంతో. .. రేవంత్ రెడ్డి సహా అందరూ దరఖాస్తు చేసుకున్నారు. బీజేపీ నాయకత్వం కూడా దాదాపుగా అలాంటి సంకేతాలనే ఇచ్చింది. వచ్చిన ధరఖాస్తులను పరిశీలించి.. అందులో ఉన్న వారికే చాన్స్ ఇస్తామని చెబుతోంది. అయినా సీనియర్లు పెద్దగా స్పందించడం లేదు. కాంగ్రెస్ పార్టీ దరఖాస్తుకు రూ. యాభై వేల ఫీజు పెట్టింది. బీజేపీలో అలాంటి ఫీజుల గోల లేదు. అయినా సరే సీనియర్ నేతలు దరఖాస్తు చేసుకోకపోవడంతో.. తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇంచార్జ్ ప్రకాష్ జవదేకర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందరూ దరఖాస్తు చేసుకోవాలని అంటున్నారు.

బీజేపీలో పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు పరిమితంగానే ఉన్నారు. అగ్రనేతలు కీలక నియోజకవర్గాల్లో పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే వారు తమ నియోజకవర్గాలకు కూడా దరఖాస్తు చేసుకోవడం లేదు. ప్రకాష్ జవదేకర్ ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో.. పదో తేదీ లోపు అందరూ దరఖాస్తు చేసుకునే చాన్స్ ఉంది. అయితే కొంత మంది దరఖాస్తు చేసుకోకపోతే ఇవ్వరా.. అన్న పట్టుదలతో . ఉన్నట్లుగా చెబుతున్నారు. అలాంటి ఈగోకు పోవాల్సిన అవసరం లేదని.. పార్టీ విధానం ప్రకారం వెళ్లాలన్న బుజ్జగింపులు సీనియర్లకు వెళ్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ బ్యాండేజీ.. మ‌ళ్లీ ట్రోల్స్ షురూ!

అదేదో యాడ్‌లో చెప్పిన‌ట్టు.. 'ఏపీలో ఏం న‌డుస్తోంది' అంటే 'బ్యాండేజీల ట్రెండ్ న‌డుస్తోంది' అంటారు అక్క‌డి జ‌నం. ప్ర‌చార స‌భ‌లో జ‌గ‌న్‌పైకి ఎవ‌రో ఓ అగంత‌కుడు గుల‌క‌రాయి విసిరిన ద‌గ్గ‌ర్నుంచీ ఈ బ్యాండేజీ...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close