బీజేపీ మళ్లీ సీబీఐ కేసుల బెదిరింపులు..!

తెలంగాణ రాష్ట్ర సమితి పెద్దలు సైలెంట్‌గా ఉంటున్నా భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం సీబీఐ జపాన్ని మాత్రం వదలడం లేదు. మిషన్ తెలంగాణను పెట్టుకున్న బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ … తెలంగాణ పర్యటనకు వచ్చి నేరుగా కేసీఆర్ కుమార్తె కవితకు హెచ్చరికలు జారీ చేశారు. సింగరేణి బెల్ట్‌లో పర్యటించిన తరుణ్ చుగ్.. అక్కడ కార్మిక యూనియన్లలో పట్టు పెంచుకున్న కవితను టార్గెట్ చేశారు.

యూనియన్‌ లీడర్‌గా ఎమ్మెల్సీ కవిత అంతా తన చేతిలో పెట్టుకున్నారని.. ఎమ్మెల్సీ కవితకు తానిచ్చే మెసేజ్‌ ఒకటేనని.. దోపిడీ దొంగల్ని బీజేపీ ఎప్పుడూ వదిలిపెట్టలేదనేదేనని ఆయన చెప్పుకొచ్చారు. వదిలి పెట్టకుండా ఎలా పట్టుకుంటారంటే.. టీఆర్ఎస్‌ ప్రభుత్వ అవినీతిపై కేంద్ర హోంశాఖ, సీబీఐకి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.

బండి సంజయ్ కూడా అంతకు ముందు అదే పనిగా సీబీఐ గురించి మాట్లాడేవారు. తమ దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయని.. కోర్టులో పిటిషన్లు వేస్తామని చెప్పేవారు. కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామనేవారు. కేసీఆర్ కు జైలు మాత్రమే మిగిలిందని హెచ్చరించేవారు. అయితే గ్రేటర్ ఎన్నికల తర్వాత.. కేసీఆర్ సైలెంట్ కావడంతో బండి సంజయ్ నోట.. కేసీఆర్ జైలు అనే మాటలు రావడం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు బీజేపీ వ్యవహారాల ఇన్చాజ్ తరుణ్ చుగ్ నేరుగా… కవితకు హెచ్చరికలు జారీ చేశారు. సైలెంట్ గా ఉంటే బీజేపీ నేతలు మరింతగా రెచ్చిపోతారని ఇటీవల కాలంలో కౌంటర్లు ఇస్తున్నారు. అయితే అవి కంట్రోల్‌లోనే ఉంటున్నాయి.

తరుణ్ చుగ్‌ను ఏమీ అనకుండా రొటీన్ విమర్శలు చేసిన బండి సంజయ్ పై … ప్రభుత్వ విప్ సుమన్ విరుచుకుపడ్డారు. కేసీఆర్‌పై మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మొత్తానికి కాస్త ఆలస్యమైనా… ీబజేపీ మళ్లీ సీబీఐ బెదిరింపులు ప్రారంభించింది. మరి టీఆర్ఎస్ ఏం చేస్తుందో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close