కేసీఆర్ తీరు వల్ల తెలంగాణాకి నష్టం?

ప్రధాని మోడీ అధ్యక్షతన నిన్న డిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి 9 మంది కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. వారి పార్టీ భూసేకరణ చట్ట సవరణలను వ్యతిరేకిస్తోంది కనుక పార్లమెంటులో దాని ఆమోదానికి మద్దతు కూడా గట్టేందుకు ప్రధాని మోడీ ఈ సమావేశాన్ని ఉపయోగించుకోబోతున్నారని గ్రహించడంతో వారందరూ తమ పార్టీ అధిష్టానం సూచనల మేరకు ఈ సమావేశానికి హాజరవలేదు. కనుక వారు హాజరు కాకపోవడం సహజమేనని భావించవచ్చును. ఇంచుమించు అదే కారణంతో వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు మమతాబెనర్జీ, జయలలిత, అఖిలేష్ యాదవ్ మరియు నవీన్ పట్నాయక్ కూడా ఈ సమావేశానికి హాజరవలేదు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన నిధుల కోసం, ప్రాజెక్టుల కోసం నిత్యం ప్రధాని మోడీ చుట్టూ, కేంద్రమంత్రుల చుట్టూ తిరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్నపుష్కరాలలో జరిగిన దుర్ఘటన కారణంగా ఈ సమావేశానికి స్వయంగా వెళ్ళలేకపోవడంతో ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావుని పంపారు. ప్రధాని మోడీకి ఆయన పరిస్థితి తెలుసు కనుక అపార్ధం చేసుకొనే అవకాశం లేదు. కానీ కీలకమయిన ఈ సమావేశానికి తెలంగాణా ముఖ్యమంత్రి డుమ్మా కొట్టడంపై అనేక విమర్శలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రాష్ట్రాల అవసరాలకు తగ్గట్లుగా నిధులు విడుదల చేయడం గురించి చర్చించడానికి ప్రధాని మోడీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఏవో కుంటిసాకులు చూపించి కేసీఆర్ డుమ్మా కొట్టడం సరయిన నిర్ణయం కాదని తద్వారా కేంద్రానికి ఆయన తప్పుడు సంకేతాలు పంపినట్లయిందని, అంతేకాక తన ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో ప్రధానికి స్వయంగా వివరించి మరిన్ని నిధులు రాబట్టే సువర్ణావకాశం కోల్పోయారని రాజకీయ విశ్లేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక ప్రధాని మోడీకి మరింత దగ్గరయ్యే సువర్ణావకాశాన్ని కూడా ఆయన కోల్పోయారని అభిప్రాయపడుతున్నారు.
ఆయన డిల్లీ వెళ్ళాక పోవడానికి పుష్కరాల నిర్వహణ, మునిసిపల్ కార్మికుల సమ్మె కారణాలని పైకి చెపుతున్నప్పటికీ, ఓటుకి నోటు కేసులో కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మాటలు విని తనను నిలువరించినందుకు కేంద్రంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నందునే కేసీఆర్ ఈ సమావేశానికి హాజరు కాలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన చిరకాల రాజకీయ ప్రత్యర్ధి అయిన చంద్రబాబు నాయుడుని, ఆయన పార్టీని చావుదెబ్బ తీసి మళ్ళీ తెలంగాణాలో కనబడకుండా చేసే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం సైందవుడిలా అడ్డుపడటంతో వదులుకోవలసి వచ్చినందుకు ఆయన ఆగ్రహించి ఉండవచ్చని రాజకీయ విశ్లేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో కేంద్రం మాట కాదని కేసీఆర్ ప్రభుత్వం ఏ మాత్రం అడుగు ముందుకు వేసినా సెక్షన్: 8ని అమలుచేయడానికి వెనుకాడబోనని కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా ఇచ్చిన సంకేతాలు కూడా ఆయనకి తీవ్ర ఆగ్రహం కలిగించి ఉండవచ్చని రాజకీయ విశ్లేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

కానీ ఎన్ని సమస్యలు సవాళ్ళు ఎదురయినా చంద్రబాబు నాయుడు కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించినందునే మోడీ ప్రభుత్వం ఆయనకి కష్టకాలంలో అండగా నిలిచిందనే విషయం కేసీఆర్ కూడా మరిచిపోకూడదని వారు సూచిస్తున్నారు. తెలంగాణా కంటే కేంద్ర ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికే ఎక్కువగా నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేస్తోంది అంటే దానికి కారణం రాష్ట్ర విభజన బిల్లులో హామీలను అమలు చేయాలనే షరతులొక్కటే కారణం కాదు, వాటి అమలుకోసం చంద్రబాబు నాయుడు నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సాగిస్తున్న సత్సంబంధాలు కూడా ప్రధాన కారణమని వారు అభిప్రాయపడుతున్నారు. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత మహా అయితే మూడు నాలుగు సార్లు డిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్రమంత్రులని కలిసి ఉంటారు. ఆయన వ్యవహార శైలి చూస్తుంటే తనకు అసలు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు, మద్దతు అవసరమే లేదన్నట్లుందని రాజకీయ విశ్లేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు కారణంగా అంతిమంగా రాష్ట్రం, రాష్ట్ర ప్రజలే నష్టపోవలసి వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ వాతావరణ శాఖ

వేసవిలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న హైదరాబాద్ ప్రజలకు కాస్త ఊరట లభించింది. శనివారం ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రతి రోజూ వడగాడ్పులతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close