రైతన్నలను కాపాడుకొనే ప్రయత్నాలు చేస్తే మేలు కదా?

ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలకు తెలంగాణా ప్రభుత్వం రూ. 1.50 లక్షలు పరిహారంగా ఇస్తోంది. దానిని రూ. 6 లక్షలకు పెంచుతూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది జూన్ 2 నుంచి అంటే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటి నుండి రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలకు ఆరు లక్షల పరిహారం అందజేస్తామని ఉత్తర్వులలో పేర్కొంది. ఇంతకు ముందు రూ. 1.50 లక్షల పరిహారం పుచ్చుకొన్నవారందరికీ కూడా మిగిలిన మొత్తం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణా ప్రభుత్వం ప్రతిపక్షాల ఒత్తిడికి లొంగో లేకపోతే మానవతా దృక్పధంతోనో ఉదారంగా ఈ ఆర్ధిక సహాయం అందజేస్తోంది. అయితే దీని వలన సమస్య తగ్గకపోగా మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ఆర్ధిక సమస్యల నుంచి ఇక ఎన్నటికీ బయటపడలేమనే నిరాశతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. తాము బ్రతికున్నా తీర్చలేని ఆర్ధిక సమస్యలన్నీ తాము చనిపోతే తప్పకుండా తీరుతాయనే నమ్మకం ప్రభుత్వమే రైతులకు కల్పించినట్లవుతుంది. తాము చనిపోవడం వలన తమ భార్య, పిల్లలయినా సుఖంగా ఉంటారనే ఆశతో అటువంటి ఆలోచన లేని రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకొనే ప్రమాదం ఉంది. నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులకు ప్రభుత్వం పెంచిన ఈ పరిహారాన్ని పొందాలని ఆశపడితే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉంది.

కనుక రైతులు చనిపోయిన తరువాత వారి కుటుంబాలను ఆదుకోవడమనే ఆలోచన మానుకొని వారు చనిపోకుండా ఏవిధంగా కాపాడుకోవాలని ఆలోచిస్తే బాగుంటుంది. ప్రభుత్వం చేతిలో సమర్ధులు, నిజాయితీపరులు, తెలివయిన అధికారులున్నారు. తెరాసకు రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో కూడా బలమయిన క్యాడర్ ఉంది. ప్రభుత్వం చేతిలో డబ్బు, అధికారం అన్నీ ఉన్నాయి. కనుక ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి, దాని ద్వారా నిస్సహాయ రైతులను ఆదుకొనే ప్రయత్నాలు చేయడం మంచి పద్ధతి. అవసరమయితే అందుకు కార్పోరేట్ సంస్థలు, స్వచ్చంద సంస్థలు, పారిశ్రామికవేత్తల సహాయ సహకారాలు కూడా కోరవచ్చును. రైతులను ఏదోవిధంగా కాపాడుకొనేందుకే ఆలోచించాలి, ప్రయత్నించాలి తప్ప చనిపోయిన తరువాత పరిహారం చెల్లించాలనే ఆలోచన సరయినది కాదు. దాని వలన ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు కూడా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close