అయితే హైకోర్టు.. లేకపోతే సుప్రీంకోర్టు – తెలంగాణ సర్కార్ తంటాలు !

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి వెళ్లకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సీబీఐకే ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడంతో ఈ రోజు మళ్లీ సింగిల్ బెంచ్ మీద .. అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. తీర్పు అమలుపై మూడు వారాల స్టే ఇవ్వాలని కోరారు. ఫాం హౌస్ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ప్రభుత్వం తెలిపింది. కేసు డైరీ కోసం సీబీఐ ఒత్తిడి చేస్తున్న విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వారం రోజుల సమయం అవసరమని చెప్పారు. మరోవైపు ఫాం హౌస్ కేసును విచారణను సీబీఐకు బదిలీ చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ న్యాయమూర్తికి విన్నవించారు. మూడు సార్లు లేఖలు రాసినా స్పందించలేదని చెప్పడంతో.. ప్రభుత్వమే సీబీఐ విచారణ ప్రారంభం కాకుండా అడ్డుకుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లయింది.

అయితే ఈ అంశంపై నిర్ణయానికి న్యాయమూర్తి నిరాకరించారు. ప్రధాన న్యాయమూర్తి అనుమతిస్తేనే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. బుధవారం సీజే పర్మిషన్ తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ చెప్పడంతో కేసు విచారణ బుధవారానికి వాయిదా వేసింది. అయితే బుధవారం హైకోర్టులో విచారణ జరగకుండానే.. నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడమే కాకుండా వెంటనే విచారణకు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. హైకోర్టులో విచారణ బుధవారానికి వాయిదా పడగానే.. కేసును సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసింది.

వెంటనే విచారణకు తీసుకోవాలంటూ సిజెఐ చంద్రచూడ్ ధర్మాసనాన్ని కోరిన సీనియర్ కౌన్సిల్ దుష్యంత్ దవే ప్రధాన న్యాయమూర్తిని కోరారు. సిబిఐ విచారణ ప్రారంభిస్తే సాక్ష్యాలన్నీ ధ్వంసమవుతాయని ఆందోళన వెలిబుచ్చారు. బుధవారం ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని దుష్యంత్ దవేను సీజేఐ కోరారు. ధర్మాసనం దృష్టికి తీసుకొస్తే వచ్చే వారం విచారణకు అనుమతి ఇస్తామన్న సిజెఐ చంద్రచూడ్ తెలిపారు. బుధవారం మెన్షన్ చేయకపోయినా వచ్చే వారం విచారణకు వస్తుందని తెలిపారు. మొత్తంగా ఈ కేసు విషయంలో ప్రభుత్వం కిందా మీదా పడుతోందని అందరికీ క్లారిటీ వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత ఏమైనా దిల్ రాజు కూతురా..?

సినిమాపై ప్యాష‌న్ ఉన్న నిర్మాత దిల్ రాజు. ఓ స‌బ్జెక్ట్ న‌చ్చితే ఎంతైనా ఖ‌ర్చు పెడ‌తారు. గుణ‌శేఖ‌ర్ కూడా అంతే. త‌న క‌ల‌ల చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావ‌డానికి ఏం చేయ‌డానికైనా సిద్ద‌మే. అందుకే...

ఈ సారి రాజమండ్రిలో టీడీపీ మహానాడు !

ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అతి పెద్ద సభను నిర్వహించేందుకు సిద్ధమయింది. ఒంగోలు మహానాడు నుంచి ఆ పార్టీలో జోష్ పెరగ్గా ఈ సారి ఎన్నికలకు ముందు రాజమండ్రిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించుకుంది....

హెచ్‌ఎండీఏ కంటే సీఆర్డీఏ పెద్దది…కానీ : కేటీఆర్

హైదరాబాద్ కంటే అమరావతి పెద్దది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏ కంటే... ఏపీ కొత్త రాజధాని సీఆర్డీఏ విస్తీర్ణం చాలా పెద్దది. ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది తెలంగాణ మంత్రి...

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ కావాలట !

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close