జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు..మళ్ళీ అదే పాట

జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు నిర్వహణపై హైకోర్టులో నేడు వాదోపవాదాలు జరుగుతున్నాయి. సుమారు ఏడాది పూర్తవుతున్నా ఇంకా జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని హైకోర్టు ప్రశ్నించడం, దానికి తెలంగాణా ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాది ఎప్పటిలాగే వార్డుల పునర్విభజన, ఓటరు కార్డులతో ఆధార్ అనుసంధానం వంటి కారణాలు చెప్పడం జరిగింది. గత ఏడాది డిశంబర్ 3వ తేదీతో జి.హెచ్.ఎం.సి.బోర్డు గడువు ముగిసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తెలంగాణా ప్రభుత్వం అదే పాట పాడుతూ కోర్టు నుంచి గడువు తీసుకొంటూనే ఉంది. మళ్ళీ ఇవ్వాళ్ళ కూడా అదే పాట పాడి జనవరి నెలాఖరు వరకు గడువు కోరింది. కాకపోతే ఈసారి ఆ గడువులోగా తప్పకుండా జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు నిర్వహిస్తామని మాట ఇచ్చింది.

వార్డుల పునర్విభజన పేరిట కాంగ్రెస్, బీజేపీ, తెదేపాలకు బలం ఉన్న వార్డులను కుదించి, తెరాసకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలలో వార్డులను విభజించి వాటి సంఖ్య పెంచాలని తెలంగాణా ప్రభుత్వం భావించింది. కానీ వార్డుల పునర్విభజన సాధ్యం కాదనే సాకుతో దానిని నిలిపివేస్తూ తెలంగాణా ప్రభుత్వమే రెండు మూడు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ఓటర్ల జాబితా సవరణ పేరిట తెరాసను వ్యతిరేకించే ఆంధ్రా ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలనుకొంది. సుమారు 6.3 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించింది కూడా. కానీ అందుకు కేంద్ర ఎన్నికల కమీషన్ పంపిన బృందం చేత చివాట్లు తినవలసి వచ్చింది కనుక ఓటర్ల జాబితాలను సవరించే అవకాశం ఇక లేనట్లే. బహుశః అందుకే జనవరి నెలాఖరులోగా జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇస్తోందని భావించవచ్చును. ఇప్పటికే చాల సార్లు గడువు పొడిగించిన హైకోర్టు ఈసారి ఆ హామీని నోటిమాటగా కాకుండా అఫిడవిట్ రూపంలో అందజేయాలని కోరింది. అంటే జనవరిలో జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావించవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close