రేవంత్, చంద్రబాబుపై తెరాస బ్రహ్మాస్త్రం: ఓటుకి నోటు కేసు

తెరాస నేతల నోటి నుండి ఇంకా ‘ఓటుకి నోటు కేసు’ ప్రస్తావన రాలేదేమిటాని అందరూ అనుకొంటున్న సమయంలోనే మంత్రి హరీష్ రావు దాని గురించి ప్రస్తావించి, నేరుగా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. హరీష్ రావుని గ్రేటర్ ఎన్నికలకి దూరంగా ఉంచినప్పటికీ చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడానికి ఆయన ‘సేవలను’ ఉపయోగించుకోవడం వ్యూహాత్మకమే కావచ్చును.

“ఓటుకి నోటు కేసు దెబ్బకి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ని, తన పార్టీని కూడా విడిచిపెట్టి ఆంధ్రాకి పారిపోయారు. దానితో తెలంగాణాలో తెదేపా నాయకుడు లేని పార్టీగా మిగిలిపోయింది. జి.హెచ్.ఎం.సి. ఎన్నికల తరువాత ఇక రాష్ట్రంలో ఆ పార్టీ కనబడకుండా పోవడం తద్యం. ఓటుకి నోటు కేసు బయటపడకపోయుంటే ఈ ఎన్నికలలో గెలిచేందుకు చంద్రబాబు నాయుడు డబ్బు మూటలు సిద్దం చేసుకొని ఉండేవారు. మీడియాతో ప్రచారం చేయించుకొని ఉండేవారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ రావాలంటేనే ఆయన భయపడుతున్నారు. ఆయన దైర్యం చేసి రెండు రోజులు హైదరాబాద్ లో ప్రచారం చేస్తున్నా దాని వలన ఆ పార్టీకి కొత్తగా ఒరిగేదేమీ ఉండదు. ఓటుకి నోటు కేసుతోనే ఆ పార్టీపై ప్రజలు నమ్మకం కోల్పోయారు. రోహిత్ మృతి కారణంగా బీజేపీకి కూడా గ్రేటర్ లో ఎదురుగాలి వీస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చెప్పనవసరం లేదు. నగరంలో దాని ఉనికే చాటుకోలేకపోతోంది. ఆ మూడు పార్టీలు కలిపి ముప్పై సీట్లు సంపాదించుకోగలిగితే అదే గొప్పనుకోవచ్చును,” అని హరీష్ రావు అన్నారు.

ఓటుకి నోటు కేసును తెరాస బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నందునే ఇన్ని రోజులు దానిని ప్రచారంలో పాల్గొంటున్న తెరాస నేతలెవరూ బయటకి తీయలేదనుకోవచ్చును. ఇప్పుడు హరీష్ రావు దానిని బయటకి తీసి తెదేపాపై సంధించారు కనుక ఇక తెరాస నేతలు అందరూ కూడా దానిని మిగిలిన ఈ మూడు రోజులలో తెదేపాపై విరివిగా ప్రయోగించే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ ఎన్నికలలో తెదేపా తరపున నారా లోకేష్ గట్టిగా ప్రచారం చేస్తున్నప్పటికీ, తెరాసపై గట్టిగా దాడి చేస్తున్న వ్యక్తి మాత్రం రేవంత్ రెడ్డేనని స్పష్టంగా కనబడుతోంది. అలాగే ఈరోజు నుండి చంద్రబాబు నాయుడు కూడా ప్రచారంలో పాల్గొనబోతున్నారు కనుక వారివురిని నిలువరించాలంటే ఓటుకి నోటు కేసు కంటే గొప్ప ఆయుధం ఉండబోదు. దానిపై వారిరువురూ ఎలాగూ సమాధానం చెప్పుకోలేరు కనుక ఇకపై తెరాస నేతలు అందరూ దానినే ప్రధానంగా ప్రస్తావించవచ్చును.

ఈ అస్త్రాన్ని ఉపయోగించడం వలన తెరాసకు మరో లాభం కూడా ఉంది. ఈ ఎన్నికలలో తెదేపాతో కలిసి పోటీ చేస్తున్న బీజేపీని దానికి దూరం చేయవచ్చును. ఎందుకంటే ఈ ఓటుకి నోటు వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెదేపాకి వ్యతిరేకంగా తన పార్టీ అధిష్టానానికి,కేంద్రప్రభుత్వానికి లేఖలు కూడా వ్రాసారు. కనుక ఈ సమయంలో తెదేపా నేతలు మళ్ళీ దానికి సంజాయిషీలు చెప్పుకొనే పరిస్థితి ఏర్పడినట్లయితే, బీజేపీ నేతలు అందరూ తెదేపాకు దూరంగా జరుగవచ్చును. అదే జరిగితే దాని వలన తెరాస లబ్ది పొందుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close