సెటిల్మెంట్ చేయాలంటే భార్యను పంపమన్న తెలంగాణ ఎమ్మెల్యే కొడుకు !

రాజకీయ నేతలు .. వారి వారసులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల్ని ఎంత దారుణంగా వేధిస్తున్నారో తెలియచేసే ఘటన తెలంగాణలో వెలుగు చూసింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవేంద్ర ఇప్పటికే అనేక వివాదాల్లో ఉన్నారు. తాజాగా పాల్వంచలో కవల పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న కుటుంబం పాపం మొత్తం వనమా రాఘవేంద్ర ఖాతాలోనే పడింది. ఓ కుటుంబ సమస్యను పరిష్కరించమని పంచాయతీకి వెళ్తే భార్యను పంపితే పనైపోతుందని బేరం పెట్టాడు వనమా రాఘవేంద్ర.

రామకృష్ణ అనే పాల్వంచ వ్యాపారి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న కొద్ది రోజుల తర్వాత సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ రామకృష్ణ చనిపోయే ముందు రాఘవేంద్ర వల్ల ఎంత మానసిక క్షోభకు గురయ్యాడో స్పష్టంగా తెలిసిపోతోంది. అత్యంత పాశవికంగా … భార్యను పంపాలని భర్తనే ఒత్తిడి చేసిన ఘటన.. సంచలనం సృష్టిస్తోంది. కొద్ది రోజుల కిందటే సూసైడ్ లెటర్ లభించింది. అందులో ఉన్న వివరాల ఆధారంగా వనమా రాఘవేంద్రను ఏ 2గా పెట్టి కేసు నమోదు చేశారు. కానీ అరెస్ట్ చేయలేదు. ఆయన మాత్రం తనకేమీ తెలియదని మీడియాకు ఇంటర్యూలు ఇస్తున్నారు.

తాజాగా వీడియో వెలుగు చూడటం.. అతని ఆకృత్యాలు సంచలనం సృష్టిస్తూండటంతో పోలీసులపై అరెస్ట్ చేయాలనే ఒత్తిడి పెరుగుతోంది. గతంలోనూ ఓ వ్యాపారి ఆత్మహత్యకు వనమా రాఘవేంద్రనే కారణం అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. వనమా రాఘవేంద్ర అత్యంత దారుణంగా ప్రజల్ని పట్టి పీడిస్తున్నాడని.. అతన్ని కాల్చి చంపాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య డిమాండ్ చేస్తున్నారు. వనమా రాఘవేంద్రను పట్టుకుని శిక్షించకపోతే.. రామకృష్ణ లాంటి కుటుంబాలు ఎన్ని నాశనం అవుతాయో చెప్పడం కష్టమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close