ఇక షర్మిలకు అండగా తెలంగాణ పోలీస్ !

సునీత, షర్మిలపై సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. వైఎస్ సునీత రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు పై FIR నమోదు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. 509, 506 IPC తో పాటు 67 IT యాక్ట్ వంటి కఠినమైన సెక్షన్లను చేర్చారు. తమని , సోదరి షర్మిల ను చంపుతామని బెదిరిస్తున్నారని… ఆధారాలు సమర్పించారు సునీత. వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి సోషియల్ మీడియా పోస్టింగ్ లు పరిశీలించి కేసు నమోదు చేశారు. శత్రు శేషం ఉండకూడదు, ఇద్దరిని లేపేయ్ అన్నాయ్ .. ఎన్నికలకు పనికొస్తారు అని పోస్టింగ్ లు ఉండటం.. గతంలో జరిగిన చరిత్రను చూస్తే.. సీరియస ఇష్యూగానే పోలీసులు గుర్తించారు. దీంతో వర్రా రవీంద్రారెడ్డిని..నేడో .. రేపో అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.

తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్నట్లుగా విజయసాయిరెడ్డి మాట్లాడిన కొద్ది గంటల్లోనే తెలంగాణ పోలీసులు ఈ కేసు నమోదు చేయడం ఆసక్తికరంగా మారింది., ఇన్ని రోజులు.. ఏపీ రాజకీయాల వైపు తెలంగాణ అధికారపక్షం చూడలేదు. షర్మిలకు రేవంత్ రెడ్డి ఎక్కడా బలమైన మద్దతు ఇస్తున్నట్లుగా కూడా కనిపించలేదు.కానీ ఇప్పుడు వైసీపీ నేతల వ్యవహారంతో… షర్మిలకు తెలంగాణ వైపు నుంచి గట్టి మద్దతు ఇవ్వాలన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది.

గత ఎన్నికల్లో జగన్ రెడ్డికి.. తెలంగాణ పోలీసుల్ని యథేచ్చగా వాడుకునే అవకాశాన్ని కల్పించారు కేసీఆర్. అందుకే డేటా చోరీ అంటూ పనికి మాలిన కేసుల్ని పెట్టి టీడీపీ యాప్ ను నిర్వహిస్తున్న ఐటీ కంపెనీలపై సోదాలు చేసి… టీడీపీ డేటా మొత్తం పోలీసుల సాయంతోనే చోరీ చేశారు. పైగా అంజనీకుమార్ వంటి ఐపీఎస్ అధికారులు మ్యాప్ లు ప్రదర్శించి ఇలా జరిగిందంటూ.. సొల్లు కథలు చెప్పి తప్పుడు ప్రచారాలు కూడా చేశారు. అదొక్కటే కాదు… చాలా ేసులు నమోదు చేశారు. అప్పట్లో ఏపీ పోలీసులపై నమ్మకం లేదని జగన్ రెడ్డి బహిరంగంగానే చెప్పేవారు. తర్వాత ఆయన చేతిలోకి ఏపీ పోలీసులు వచ్చారు. వారిని ఆయన ఎలా వాడుకున్నారో అందరూ చూశారు. ఇప్పుడు రివర్స్ లో తెలంగాణ పోలీసులు షర్మిల, సునీతకు అండగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close