తెలంగాణా రాష్ట్రం పట్ల ఇంకా ఈ వివక్ష ఎందుకు?

తెలంగాణా రాష్ట్రం ఏర్పడి ఏడాదిన్నర దాటింది. అయినా ఆ రాష్ట్రానికి బాలారిష్టాలు తప్పడం లేదు. దేశంలో అన్ని రాష్ట్రాలు తమ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిభింబిపజేసే శకటాలను గణతంత్ర దినోత్సవం రోజు జరిగే పెరేడ్ లో ప్రదర్శిస్తుంటాయి. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ ఏడాది జనవరి 26న జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో తెలంగాణా శకటం ప్రదర్శనకు అతి కష్టం మీద అనుమతి లభించింది. మొట్ట మొదటిసారి ఆ వేడుకలలో పాల్గొన్నపుడు, తెలంగాణాకే ప్రత్యేకమయిన బోనాల పండుగను, తెలంగాణా రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలను హైలైట్ చేసింది తెలంగాణా శకటం. కనుక వచ్చే నెలలో జరుగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలలో తమ రాష్ట్ర శకటాన్ని ప్రదర్శించుకోవాలని తెలంగాణా ప్రభుత్వం భావిస్తే అందులో తప్పేమీ లేదు. కానీ ఈసారి కూడా సంబంధిత అధికారులు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం చేసిన రెండు ప్రతిపాదనలను తిరస్కరించారు. దానికి కారణాలు ఏమిటో తెలియదు.

కేంద్రప్రభుత్వం తమ పట్ల ఈవిధంగా అనుచితంగా వ్యవహరించడంపై తెలంగాణా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఏడాదిన్నర కాలం గడిచిపోయినా ఇంకా దాని ఉనికిని కేంద్రప్రభుత్వమే గుర్తిస్తున్నట్లు లేదని తెరాస నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే తన నిరసన తెలియజేసేందుకు ఇకపై గణతంత్ర దినోత్సవ వేడుకలకు తమ రాష్ట్ర శకటాన్ని పంపకూడదని తెలంగాణా ప్రభుత్వం నిశ్చయించుకొన్నట్లు తెరాస ఎంపీ జితేందర్ రెడ్డి నిన్న లోక్ సభలో ప్రకటించారు. కేంద్రప్రభుత్వం తనంతట తానుగా ఆహ్వానిస్తే తప్ప రాష్ట్ర శకటాన్ని పంపబోమని ఆయన లోక్ సభలో ప్రకటించారు. కనుక కేంద్రప్రభుత్వం తక్షణమే స్పందించి తప్పనిసరిగా తెలంగాణా రాష్ట్ర శకటం కూడా ప్రతీ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు అవసరమయిన చర్యలు చేపడితే మంచిది. ఈ విషయంలో తెరాస ఎంపీలు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు సహకారం తీసుకొంటే మంచిదేమో ఆలోచించాలి. కేంద్రప్రభుత్వంపై అలిగి గణతంత్ర దినోత్సవ వేడుకలలో తెలంగాణా రాష్ట్ర శకటాన్ని పంపించమని చెపితే అది తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందని గ్రహించాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close