అమృతారామ‌మ్‌… ఇప్ప‌టిది కాదు ఈ బేర‌మ్‌!

విడుద‌ల కాని చిన్న‌, మీడియం సైజు సినిమాల‌కు ఓటీటీ సంస్థ‌లు గాలాలు వేస్తున్న రోజులివి. `థియేట‌ర్ల కోసం ఎదురు చూడ‌కుండా ఓటీటీలోనే మీ సినిమాల్ని విడుద‌ల చేసుకోవ‌డం మంచింది` అంటూ స‌ల‌హాలు వినిపిస్తున్న సంద‌ర్భం ఇది. కొంత‌కాలం ఎదురు చూద్దామా? లేదంటే ఓటీటీలో సినిమాని విడుద‌ల చేసుకుందామా? అని నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నారు. ఈలోగా.. ఓ సినిమా ఓటీటీలో ఆడ‌డానికి రెడీ అయ్యింది. అదే `అమృతారామ‌మ్‌`. ఈనెలాఖ‌రున జీ 5 లో ఈ చిత్రం ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. ఓటీటీలో నేరుగా విడుద‌ల అవుతున్న తొలి సినిమా ఇదే అంటూ ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.

నిజానికి… ఇది ఓటీటీ కోసం తీసిన సినిమా కాదు. థియేట‌ర్ కోస‌మే తీశారు. ఓటీటీ లో ప్ర‌ద‌ర్శించుకోవ‌డానికి జీ 5కి ఈ సినిమాని అమ్మేశారు. థియేట‌ర్లో విడుద‌లైన 30 రోజుల త‌ర‌వాత ఈ సినిమాని ప్ర‌ద‌ర్శించుకునేందుకు అన్ని హ‌క్కులూ క‌ల్పిస్తూ ఒప్పందం కుదిరింది. అయితే… ఇందులోనే మ‌రో ష‌ర‌తు కూడా జోడించారు. ఒక‌వేళ సినిమా ఎలాంటి కార‌ణాల‌తోనైనా విడుద‌ల కాని ప‌క్షంలో 100 రోజుల త‌ర‌వాత ఓటీటీలో ప్ర‌ద‌ర్శించుకోవ‌డానికి వీలుగా ఒప్పందం కుదిరింద‌ట‌. 100 రోజుల్లోపు సినిమా ఎందుకు విడుద‌ల కాదు? అనుకున్నారేమో దర్శ‌క నిర్మాత‌లు ఒప్పందాల‌పై సంత‌కాలు చేశారు. కానీ స‌డ‌న్‌గా.. లాక్ డౌన్ వ‌చ్చి ప‌డింది. అందుకే ఈ సినిమా ఇప్పుడు ఒప్పందం ప్ర‌కారం జీ 5లో విడుద‌ల‌కు ముందే ప్లే అయిపోతోంది. ఈ సినిమాకి 2.5 కోట్ల బ‌డ్జెట్ అయ్యింద‌ని టాక్‌. ఓటీటీ ద్వారా నిర్మాత‌ల‌కు 60 ల‌క్ష‌ల‌కు మించి రాలేద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close