బీజేపీపై వార్ : తెలుగు పార్టీలది గోడ మీద పిల్లి వాటమే..!

దేశంలో బీజేపీని వ్యతిరేకించి పార్టీలతో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో మోడీని దించడమే లక్ష్యంగా కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశానికి 19 పార్టీలు హాజరయ్యాయి. రాజకీయ కారణాలతో ఆమ్‌ ఆద్మీ పార్టీని కాంగ్రెస్ ఆహ్వానించలేదు. యూపీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఎస్పీ, బీఎస్పీ రావడానికి ఇష్టపడలేదు. అయితే ఈ మూడు పార్టీలూ బీజేపీకి వ్యతిరేకమే. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక్కపార్టీ కూడా బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరేందుకు ధైర్యం చూపలేకపోయింది. నిజానికి ఏ పార్టీ కూడా తము బీజేపీతో అంటకాగుతున్నాం అని ఒప్పుకోవడం లేదు.. అలాగని పోరాడుతున్నామని కూడా చెప్పలేకపోతున్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్‌ భారతీయ జనతా పార్టీని శత్రువుగా చూస్తోంది. ఒకప్పుడు ఆ పార్టీపై యుద్ధమే అన్న టీఆర్ఎస్ అధినేత ఇప్పుడు సైలెంటయిపోయారు. ఢిల్లీ స్థాయిలో సహకారం.. రాష్ట్ర స్థాయిలో పోరాటం అన్నట్లుగా ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి లేకుండా కపిల్ సిబల్ నిర్వహించిన విపక్ష పార్టీల భేటీకి టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. కానీ సోనియా నిర్వహించిన భేటికి మాత్రం దూరంగా ఉన్నారు. అంటే ప్రత్యేక ఎజెండా అమలు చేస్తున్నారని అనుకోవాలి. టీఆర్ఎస్‌ బీజేపీకి ఎదురెళ్లే ధైర్యం చేయడం లేదని తాజా సమావేశంతో తేలిపోయింది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలు మోడీ అంటేనే భయపడుతున్నాయి. ఎందుకొచ్చిన గోల అని సైలెంట్‌గా ఉంటున్నాయి. ఢిల్లీలో బీజేపీతో సన్నిహిత సంబంధాల కోసం రెండు పార్టీలు పోటాపోటీప్రదర్శనలు చేస్తున్నాయి. విపక్షాల భేటీలకు వెళ్లవు. పార్లమెంట్‌లో ఏమైనా బిల్లులు వివాదాస్పదమైతే ప్రభుత్వానికే అండగా ఉంటున్నాయి. వ్యతిరేకిస్తే దుర్భర పరస్థితులు ఎదురువుతాయని ఆయా పార్టీల అధినేత భయం కావొచ్చు. ఈ కారణంగా బీజేపీతో మనకెందుకులే అనుకుంటున్నారు. భయంతో రాజకీయాలు ఎంత కాలం చేస్తారో కానీ.., ఢిల్లీ రాజకీయాల్లో తెలుగు పార్టీలను పట్టించుకోవడం కూడా మానేసే పరిస్థితి వచ్చింది.

అధికారంలో ఉన్న వారు వేధింపులకు పాల్పడతారని వారిపై పోరాడటం ఆపేస్తే. ప్రజలు కూడా నమ్మడం మానేస్తారు. తెగించి పోరాడిన వారికే ప్రజల మద్దతు లభిస్తుంది. ఒక్కోసారి ఎదురు దెబ్బలు తగలవచ్చు కానీ.. వెనక్కి తగ్గితే ఇబ్బందే. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు డబుల్ గేమ్ ఆడకుండా నేరుగా బీజేపీకి దగ్గరో.. దూరమో తేల్చుకుంటే… దేశ రాజకీయంలోనూ ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close