విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి విభజన జరిగి పదేళ్లు అవుతుంది. ఏపీలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఉన్న సీఎం విదేశాలకు వెళ్తున్నారు. ఆయన పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ప్రస్తుతం రేవంత్ రెడ్డిని కలవడానికి .. రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం ఆయన ప్రయత్నించే అవకాశాలు లేవు.

విభజన చట్టం అమల్లోకి వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా ఉద్యోగుల కేటాయింపు మొదలుకుని ఆస్తులు, అప్పుల పంపిణీ వరకు పెండింగ్‌ అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని సీఎం రేవంత్ ఇప్పటికే ఆదేశించారు. షెడ్యూలు 9, 10 లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ, విద్యుత్తు సంస్థల బకాయిలు తదితర అంశాలపై ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీల వంటి చిన్న చిన్న అంశాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సూచించారు.

ఇప్పటి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ జూన్‌ 2 తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనుంది. పెద్దగా మార్పేమీ లేకపోయినా ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగించాల్సి ఉంది. నిజానికి జగన్ గెలిచినప్పుడు ప్రమాణస్వీకారం చేయక ముందే అన్నీ ఇచ్చేశారు. ఒక్క లేక్ వ్యూ గెస్ట్ హౌస్ మాత్రమే ఉంది. ఇప్పుడు అది కూడా ఇచ్చేయాల్సి ఉంది. రేవంత్ సీఎం అయ్యాక.. ఢిల్లీలో తెలంగాణ భవన్ సమస్యకు ముగింపునిచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close