సీఎం అడగక ముందే వరద సాయం రూ.895 కోట్లిచ్చేశారట !

రాయలసీమ, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అయిపోయాయని… తక్షణం రూ. వెయ్యికోట్ల సాయం చేయాలని సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారు. ఆ తర్వాత రాజ్యసభలో విజయసాయిరెడ్డి కూడా అడిగారు. సీఎం జగన్ రాసిన లేఖకు స్పందన లేదు కానీ.. పార్లమెంట్‌లో ఎంపీ అడిగారు కాబట్టి వెంటనే సమాధానం బయటకు వచ్చింది. అదేమిటంటే వరదలు రాక ముందే రూ. 895కోట్లు ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిందట. కేంద్రమంత్రి నిత్యానందరాయ్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

భారీ వర్షాలు, వరదల వలన సంభవించిన పంట, ఆస్తి నష్టానికి సంబంధించి 895 కోట్ల రూపాయలను రాష్ట్ర విపత్తుల నిధి ( ఎస్‌డిఆర్‌ఎఫ్ ) కింద కేంద్ర ప్రభుత్వ వాటాగా ముందస్తుగానే విడుదల చేశామని స్పష్టంచేశారు. విపత్తులు సంభవించినపుడు బాధితులకు తక్షణ సాయం, పునరావాసం కల్పించేందుకు ఎస్డీఆర్‌ఎఫ్‌ నుంచి నిధులను వినియోగించేందుకు వీలుగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు 1,192.80 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం వాటా 895.20 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 297.60 కోట్లు. కేంద్ర ప్రభుత్వ వాటా 895.20 కోట్లను రెండు విడతలుగా ఇచ్చేశామని మంత్రి తెలిపారు.

విపత్తుల నిర్వహణ బాధ్య ప్రాధమికంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుంది. విపత్తులు సంభవించినపుడు రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నుంచి నిధులను వినియోగించి సహాయ చర్యలు చేపట్టవలసి ఉంటుందన్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు కేవలం సహాయ చర్యలకు మాత్రమే వినియోగించాలి తప్ప నష్టపరిహారం చెల్లించడానికి కాదని స్పష్టం చేశారు. అంటే ఇక కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా సాయం అందదరని పరోక్షంగా కేంద్రం చెప్పినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close