అమరావతి పిటిషన్ల విచారణ.. ఇద్దరు జడ్జిల్ని మార్చాలన్న ప్రభుత్వ లాయర్లు !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమరావతి పిటిషన్లపై విచారణ సాగడం ఇష్టం లేనట్లుగా ఉంది. చాలా రోజుల తర్వాత విచారణ ప్రారంభమైతే వెంటనే.. ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులపై ప్రభుత్వ లాయర్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు. చీఫ్ జస్టిస్ కాకుండా ఉన్న ఇద్దరు న్యాయమూర్తుల్ని ధర్మాసనం నుంచి తప్పించాలని విచారణ ప్రారంభం కాగానే వాదనలు వినిపించారు. అయితే చీఫ్ జస్టిస్ మాత్రం రాజధాని పిటిషన్లకు ప్రాధాన్యం ఉందని.. ఆలస్యం కానీయబోమని స్పష్టం చేసి.. వారి విజ్ఞప్తిని తోసి పుచ్చారు.

న్యాయమూర్తులపై ఎందుకు అభ్యంతరం చెబుతారో కానీ ప్రభుత్వ లాయర్లు న్యాయవ్యవస్థను కూడా కించ పరుస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే బెంచ్ మార్చాల్సి వస్తే విచారణ వాయిదా వేస్తారని ఆ వ్యూహంతోనే ప్రభుత్వం ఇలా చేస్తోందని.. ఇదంతా న్యాయప్రక్రియపై ప్రజల్లో అనుమానాలను కల్పించే వ్యూహామని రాజధాని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ లాయర్ల వాదనను చీఫ్ జస్టిస్ తిరస్కరించడంతో విచారణ ప్రారంభమయింది.

రాజధాని పిటిషన్లు పరిష్కారం కాకపోవడంతో అభివృద్ధి ఆగిపోయినట్లుగా కనిపిస్తోందని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. వేగంగా ఈ పిటిషన్లను పరిష్కరిస్తామన్నారు. హైబ్రిడ్ పద్దతిలో విచారణ జరుగుతోంది. రైతుల తరపున శ్యాందివాన్ వాదనలు వినిపిస్తున్నారు. విచారణ రోజువారీగా సాగుతుందా .. లేదా అనేదానిపై ధర్మాసనం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close