ఏబీవీకి రెండు వారాలు రిలీఫ్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనను వీకెండ్‌లో అరెస్ట్ చేస్తుందని తెగ బాధపడిన మాజీ ఇంటలిజెన్స్ చీఫ్, ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు రిలీఫ్ లభించింది. ఆయన విషయంలో రెండు వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తనను వీకెండ్‌లో అరెస్ట్ చేసి… నలభై ఎనిమిది గంటల పాటు కస్టడీలో ఉన్నట్లుగా చూపించి మరోసారి సస్పెన్షన్ వేటు వేసే కుట్ర చేస్తున్నరని ఆరోపిస్తూ… దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపి ఉత్తర్వులు ఇచ్చింది. రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కు కూడా లేఖ రాశారు. అర్జంట్‌గా ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మీటింగ్ ఏర్పాటు చేస్తే.. తనపై ఏపీ సర్కార్ పన్నుతున్న కుట్రను.. సవివరంగా సాక్ష్యాలతో సహా తెలియచేస్తానన్నారు. అయితే.. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎలాంటి స్పందన వ్యక్తం చేసిందో స్పష్టత లేదు. ఈ లోపు కోర్టు నుంచి మాత్రం ఆయనకు రిలీఫ్ ఇచ్చింది. ఇప్పటికి …దాదాపుగా ఇరవై నెలలుగా ఆయనకు పోస్టింగ్ లేదు. జీతభత్యాలుకూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఇప్పుడు ఆయన న్యాయపోరాటం చివరి దశకు వచ్చింది.

ప్రభుత్వం మొదట్లో ఆయనపై చేసిన ప్రచారానికి ప్రస్తుతం నమోదు చేస్తున్న అభియోగాలకు పొంతన లేదు. రూ. పది లక్షలు ప్రభుత్వం నష్టపోవడానికి కారణం అని ఇప్పుడు చెబుతోంది. అయితే ఆ రూ. పది లక్షలు నష్టపోవడానికి కూడా తాను కారణం కాదని.. సంబంధిత కొనుగోలు కమిటీల్లో తాను లేనని చెబుతున్నారు. ప్రభుత్వం తనపై నమోదు చేసినవన్నీ తప్పుడు ఆరోపణలని ఆయన అంటున్నారు. కోర్టులు కూడా.. నిబంధనల ప్రకారం.. ఆయనపై చేసిన అభియోగాలను నమోదు చేయాలని సూచించింది. ఇప్పుడు… వాటిని చేయలేకపోతే… ఏబీవీ మరింత దూకుడుగా న్యాయపోరాటం చేసే అవకాశం ఉంది. అయితే ఈ లోపే మరోసారి కుట్ర పూరితంగా సస్పెన్షన్ వేటు వేస్తారన్న ఆందోళనతో తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close