పేదలపై ఇంత రుబాబా ? ఓట్లేసింది వాళ్లేనని గుర్తు లేదా !?

ఆంధ్రప్రదేశ్‌లో వన్ టైం సెటిల్మెంట్ పథకం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 1983 నుంచి ప్రభుత్వఇళ్ల లబ్దిదారుల దగ్గర్నుంచి రూ. పది నుంచి రూ. ఇరవై వేలు వసూలు చేసేందుకు అధికార యంత్రాంగం ఇప్పుడు పరుగులు పెడుతోంది. టార్గెట్లు నిర్దేశించుకుని మరీ ప్రజల్ని పీడిస్తున్నారు. అందరూ నిరుపేదలే. ప్రభుత్వ పథకాలపైఆధారపడి బతుకుతున్న వారే్. ఇలాంటి సమయంలో వారి నుంచి రూ. పదివేలు , రూ. ఇరవై వేలు వసూలు చేయాలన్న ఆలోచనే దారుణం అయితే.. అది వారి మేలుకే అన్న ఓ రకమైన ప్రచారం చేస్తూ డబ్బులు గుంజుకునే ప్రయత్నం చేయడం మరీ దారుణంగా ఉంది.

ప్రభుత్వం స్వచ్చందం అని చెబుతోంది.కానీ నిర్బంధమని అధికారులు.. వాలంటీర్లు సహా అందరూ నిరూపిస్తున్నారు. గ్రామ వాలంటీర్ స్థాయిలో లబ్దిదారులందర్నీ గుర్తించి ఆ మేరకు వారికి ఓటీఎస్ పథకాన్ని వినియోగించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. చాలా చోట్ల పేదలు కట్టడానికి సిద్ధంగా లేరు. ఈ క్రమంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నోటి మాటగా ఆదేశించారు. పథకాలు ఆపేస్తున్నారు. డ్వాక్రా డబ్బులు తీసుకుంటున్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర నుంచి వాలంటీర్లు అప్పులు ఇప్పిస్తున్నారు. ఇవన్నీ బహిరంగరహస్యాలు.

ప్రభుత్వం .. రూ. మూడు లేదా .. నాలుగు వేల కోట్లను వసూలు చేసుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందు కోసం సచివాలయాలు, మండలం, పట్టణాల వారీగా లక్ష్యం నిర్దేశించారు. ప్రతి మండలానికి రోజుకు 50, పట్టణంలో సచివాలయానికి 5 చొప్పున ఓటీఎస్‌ కింద కట్టించాలని టార్గెట్ పెట్టారు. వార్డు, గ్రామ వాలంటీరు రోజుకు ఒకటి, పంచాయతీ కార్యదర్శి 3కు తక్కువ లేకుండా చూడాలని మండల స్థాయి అధికారులు ఒత్తిడి పెంచుతున్నారు. మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు ఇలా అందరికీ ఒక్కో తరహా లక్ష్యం విధించారు। దీంతో అందరూ పరుగులు పెడుతున్నారు. పేదల మెడపై కత్తి పెడుతున్నారు.

ప్రస్తుతం వసూలు అవుతున్నడబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తోంది. కానీ పేదల గురించి.. వారి ఓట్ల గురించి ఆలోచించడం లేదు. ఎందుకంటే.. వారు కూడా జగనన్న అని చెప్పి ఓట్లేసిన వాళ్లే. అన్నీ ఉచితం.. అని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం ఇప్పుడు ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తూండటం చాలా మందిని అసంతృప్తికి గురి చేస్తోంది. అది ఓట్ల రూపంలో బయటపడితే మొత్తానికే మోసం వస్తుంది. దీన్ని ఎప్పటికి గుర్తిస్తారో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close