వైసీపీ లీడర్లు, క్యాడర్కు ఇప్పుడు పరిస్థితి అర్థమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. జగన్ రెడ్డి ఆడే ఆటలో తామే బలి పశువులం అని.. తమ శవాలపై నుంచి ఆయన రాజకీయం చేసి బాగుపడే ప్రయత్నం చేస్తున్నారు కానీ కనీస సాయం చేసే ఆలోచనలు కూడా ఆయనలో లేవని.. ఇక రావని క్లారిటీకి వస్తున్నారు. ఇటీవల జరిగిన పరిణామాలతో వైసీపీలో క్యాడర్ దుస్థితి ఎంత ఘోరంగా ఉందో మరోసారి చర్చనీయాంశమయింది.
ఏడాది కిందట ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు పరామర్శ – రూపాయి సాయంలేదు !
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బెట్టింగ్ కారణంగా నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. వైసీపీని, జగన్ ను, ఆరా మస్తాన్ ను నమ్మి పెద్ద ఎత్తున బెట్టింగులు కట్టి ఆస్తులు. పోగొట్టుకున్నారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. వారికి జగన్ రెడ్డి నుంచి ఏడాది పాటు ఎలాంటి పలకరింపు లేదు. ఆ కుటుంబాలకు సాయం లేదు. కానీ కుల రాజకీయం చేయడం కోసం ఏడాది తర్వాత నాగమల్లేశ్వరరావు ఎంచుకున్నారు. విగ్రహం పెట్టించారు. కానీ ఆ కుటుంబానికి ఇసుమంత సాయం కూడా చేయలేదు.
కార్యకర్తలు చచ్చిపోయినా దిక్కులేని బతుకులే !
జగన్ రెడ్డి శవరాజకీయం కోసం వెళ్తూంటే.. ఇద్దర్ని బలి తీసుకున్నారు. వారిద్దరూ జగన్ రెడ్డి హార్డ్ కోర్ అభిమానులు. వారు చచ్చిపోతే ఒక్క కన్నీటి చుక్క రాల్చలేదు.. ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటి అన్నది ఎవరికీ తెలియదు. కానీసం కన్సర్న్ వ్యక్తం చేయలేదు. ఇతర పార్టీలు అయితే. .. ఆ కుటుంబాలకు అండగా ఉండేవి. కానీ వైసీపీ డీఎన్ఏలో అలాంటివి లేదు. కానీ అందరిపై కేసులు నమోదు మాత్రం చేయిస్తూంటారు. అందర్నీ బూతులు తిట్టించి..దాడులు చేయించడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. కానీ వారు కేసుల పాలయితే పట్టించుకునే దిక్కు ఉండదు.
సొంత క్యాడర్ పై టీడీపీ ముద్ర – ఇంకెలా ఉంటారు ?
రప్పా రప్పా నరుకుతాం అని పోస్టర్ తీసుకుని జగన్ రెడ్డి పర్యటనలో నిలబడితే.. ఓ కార్యకర్తకు ఆయన ఇచ్చిన బహుమతి టీడీపీ కార్యకర్త. గతంలో టీడీపీ కార్యకర్త అని ముద్ర వేశారు. ఇప్పుడు ఆ కార్యకర్త జైల్లో ఉన్నాడు. ఆ కుటుంబానికి దిక్కు లేకుండా పోయింది. ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. సొంత తల్లి, చెల్లి మీద టీడీపీ ముద్ర వేయడానికి వెనుకడాని జగన్ రెడ్డి గురించి ఎక్కువగా ఆశించడం కూడా తప్పే. గత , ప్రస్తుత, వర్తమానంలో జగన్ రెడ్డికి లీడర్లు, క్యాడర్లు కేవలం తన కోసం బలయ్యే వారు మాత్రమే. వారిని బలి చేసి .. తాను ఎదగాలని అనుకుంటారు.