ఆర్ 5 జోన్‌ పై సుప్రీంకోర్టులో జగన్ రెడ్డి సర్కార్‌కు ఎదురుదెబ్బ !

రాష్ట్రమంతా లక్షల మందికి సెంట్ స్థలాలిచ్చిపట్టుమని పది వేల మందికి కూడా ఇళ్లు కట్టివ్వకుండా.. కోర్టు కేసుల్లో ఉన్న అమరావతి పొలాల్లో సెంట్ స్థలాలిచ్చి ఇళ్లు కట్టేస్తామని బయలుదేరిన ప్రభుత్వానికి సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఆర్ 5 జోన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని తోసి పుచ్చింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ కు వాయిదా వేసింది. అమరావతి ఆర్‌5 జోన్‌లో చేపట్టే ఇళ్ల నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని గతంలో ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

సుప్రీం ఉత్తర్వుల ప్రకారం పేదలకు ఇస్తున్న పట్టాలు అంతిమ తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. సుప్రీంకోర్టు స్థలం ఇవ్వడానికి మాత్రమే అనుమతి గానీ కట్టడానికి కాదని తెలిపింది. సుప్రీంకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే ఎవరు దీనికి భాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తుంటే కోర్టు చూస్తూ ఊరుకోదని స్పష్టం చేసింది. CRDA నిబంధనల ప్రకారం భూమి కోల్పోయిన వారికి హౌసింగ్ కోసం 5 శాతం భూమి కేటాయించారని… కానీ బయట వారికి స్థలాలు ఇస్తామని తెచ్చిన సవరణలు చర్చనీయాంశంగా ఉన్నాయన్నారు. ఈ పరిస్థితులలో ఇళ్ళ నిర్మాణం అనుమతించ లేమని ధర్మానసం స్పష్టం చేసింది.

సుప్రీం లో కేసులు తేలిన తరువాత మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని తీర్పు చెప్పింది. అమరావతిని నిర్వీర్యం చేసే లక్ష్యంతోనే కోర్ క్యాపిటల్ ఎరియాలో రైతులు ఇచ్చిన పొలాలను.. ఆర్ 5 జోన్ గా మార్చారనే విమర్శలు ఉన్నాయి. ఇతర చోట్ల స్థలాలు ఉన్నప్పటికీ పేదలకు ఇళ్లు కట్టించకుండా.. కేవలం రాజధానిలో ఆర్ 5 జోన్ లోనే ఇలాంటి కుట్ర చేస్తున్నారు. చట్ట విరుద్ధంగా.. రాజ్యాంగవిరుద్ధంగా చేస్తున్న కుట్రలు న్యాయస్థానాల్లో తెలిపోతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close