నెల్లూరు కోర్టులో దొంగతనంపై రాజకీయం !

నెల్లూరు కోర్టులో దొంగతనం అంశం ఏపీలో రాజకీయ కలకలం రేపుతోంది. చోరీ అయిన కేసులోని సాక్ష్యాలు కొత్త మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఖచ్చితంగా శిక్ష పడే కేసుగా భావిస్తూండటంతో ఎక్కువగా ఆయన వైపే అనుమానంగా చూస్తున్నారు. దొంగలు ఎక్కడైనా విలువైన వస్తువులు ఎత్తుకెళ్తారని ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుని మరీ సాక్ష్యాలు తీసుకెళ్లడం ఏమిటన్న అనుమానం సహంజగానే వస్తుంది. వాటిని మటుకే తీసుకెళ్లి పనికి రాని వాటిని కోర్టు ప్రాంగణంలోనే పడేశారు. ఈ వ్యవహారం న్యాయవర్గాల్లోనూ కలకలం రేపింది.

కాకాణిపై కేసును గతంలోనే వెనక్కితీసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించిందని కానీ సాధ్యం కాలేదని ఇప్పుడు దొంగతనం పేరుతో సాక్ష్యాలను మాయం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటన జరిగగడం న్యాయవ్యవస్థపై దాడి చేయడమేనని టీడీపీ నేత పయ్యావుల ఆరోపించారు. ఈ విషయాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టాలన్నారు. వైసీపీ నేతలు న్యాయవ్యవస్థతో సైతం ఆడుకుంటున్నారని మండిపడ్డారు.

మరో వైపు కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులు మాత్రం ఈ మొత్తం దొంగతనం విషయంలో కుట్ర ఉందని అంటున్నారు. మంత్రి అయిన తర్వాత సాక్ష్యాలను దొంగతనం చేయిస్తే అందరికీ ఆయనపైనే అనుమానం వస్తుందని అలా చేశారని అంటున్నారు. నెల్లూరు అంతర్గత రాజకీయాలు ఈ దొంగతనానికి కారణం అయ్యాయని వారంటున్నారు. ఈ విషయంలో పోలీసులు ఇంత వరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

కోర్టులోనే దొంగతనం జరగడం అంటే పూర్తిగా శాంతిభద్రతలు ఫెయిలయినట్లేనని.. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో అందరి అనుమానపు చూపులు వైసీపీ పైనే పడుతున్నాయి. దీనిపై వైసీపీ కానీ.. కాకాణి కానీ ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close