రాప్తాడులో హెలికాప్టర్ వద్ద జగన్ రెడ్డిని చంపాలనుకున్నారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. పోలీసుల్ని తక్కువగా పెట్టారని దానికి కారణంగా చెబుతున్నారు. జగన్ రెడ్డి శవ పరామర్శకు వస్తే నాలుగైదు నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేశారు. హెలికాఫ్టర్ ను చుట్టుముట్టాలని తోపుదుర్తి తన అనుచరులకు పిలుపునిచ్చారు. స్వయంగా హెలిప్యాడ్ వద్దకు జనాలను తీసుకెళ్లారు. అసలు హెలికాఫ్టర్ వద్దకు వెళ్లి ఏం చేయాలనుకుంటారు?.
హెలికాఫ్టర్ వద్దకు వెళ్లిన వాళ్లంతా తోపుదుర్తి అనుచరులే. హెలిప్యాడ్ మీద ఎండింది కూడా వాళ్లే. హెలికాఫ్టర్ల్ విండ్ షీల్డ్ దెబ్బతినడానికీ కారణం వాళ్లే. అందుకే పోలీసులు వీడియోల ఆధారంగా కేసులు పెట్టారు. అంతా తోపుదుర్తి చేశాడని ఆయనపై కేసు పెట్టారు. సుప్రీంకోర్టు వరకూ వెళ్లి అరెస్టు నుంచి రక్షణ పొంది బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతున్నారు. జగన్ ను చంపడానికి ఎవరైనా కుట్ర చేసి ఉంటే…అక్కడ ఉన్న సాక్ష్యాలను బట్టి ఆ కుట్ర తోపుదుర్తిదేనని క్రిమినాలజీలో కాస్త నైపుణ్యం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది.
వైసీపీ అంటే శవ రాజకీయాలు, కుట్ర రాజకీయాలు. జగన్ రెడ్డి బయటకు వస్తున్నాడంటే.. తోసుకోవడానికి కొంత మంది జనాలను ఆర్గనైజ్ చేయాలి. తోసుకుని ఎం చేస్తారో ఎవరికీ తెలియదు. గట్టిగా వంద మంది లేకపోయినా తోపులాటలు సహజంగానే ఉంటాయి. కెమెరా మాత్రం ఆ తోపులాటల మీదనే ఉంటుంది. గ్రౌండ్ అంతా ఖాళీగా ఉందని పట్టించుకోరు. మా జగన్ రెడ్డితోపు ఆయనపై ప్రజలు కోపంగా లేరు.. విరగబడి వచ్చేస్తున్నారని చెప్పుకోవడానికి ఈ తతంగం. అందులో మళ్లీ కుట్రలు…కుతంత్రాలు. రాజకీయాలకు వైసీపీ నేతలు పెను శాపంగా మారుతున్నారు.