ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో ఇదో విచిత్ర‌మైన ప‌రిస్థితి.

`క‌ల్ట్‌` అనే మాట‌… `బేబీ` సినిమాతో పాపుల‌ర్ అయ్యింది. ఆ సినిమా నిర్మాత‌లు త‌మ త‌దుప‌రి చిత్రానికి `క‌ల్ట్` అనే టైటిల్ పెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే.. అప్ప‌టికే విశ్వ‌క్‌సేన్ `క‌ల్ట్` అనే సినిమా ప్ర‌క‌టించేశాడు. తాజుద్దీన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. విశ్వ‌క్‌సేన్ ముందుగానే ఈ టైటిల్ రిజిస్ట‌ర్ చేయించేయ‌డంతో.. ఇప్పుడు ఆ టైటిల్ పై ఆయ‌న‌కే హ‌క్కు ఉంద‌నుకోవాలి.

అయితే… ఇప్పుడు `క‌ల్ట్ ల‌వ్ స్టోరీ` అనే పేరుతో మ‌రో సినిమా రూపుదిద్దుకొంటోంద‌ని స‌మాచారం. నీల్ ద‌ర్శ‌కుడు. స‌త్య‌నారాయ‌ణ మ‌ల్లిడి నిర్మాత‌. బ‌న్నీ, ఢీ లాంటి సూప‌ర్ హిట్స్ త‌ర‌వాత స‌త్య‌నారాయ‌ణ మ‌ల్లిడి తీస్తున్న సినిమా ఇది. ఈ టైటిల్ కూడా ఛాంబ‌ర్‌లో రిజిస్ట‌ర్ అయిపోయింది. ఇప్ప‌టికైతే మూడు టైటిళ్ల‌పై మూడు సినిమాలూ సెట్స్‌పై ఉన్నాయి. కానీ.. ఇవి మూడూ ఒకేసారి విడుద‌లైతే ప‌రిస్థితి ఏమిటో అర్థం కావ‌డం లేదు. టైటిల్ విష‌యంలో ఛాంబ‌ర్‌లో పంచాయితీ న‌డ‌వ‌డం గ్యారెంటీ అనిపిస్తోంది. ఏం జ‌రుగుతోందో చూద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close