‘మాడా’ వెంకటేశ్వర రావు ఇక లేరు

ప్రముఖ హాస్యనటుడు మాడా వెంకటేశ్వరరావు(65) శనివారం రాత్రి హైదరాబాద్‌, అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొద్దికాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఈనెల 17న అపోలో ఆసుపత్రిలో చేర్చారు.

‘మాడా’ పూర్తి పేరు మాడా వెంకటేశ్వర రావు. ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలంలో దుళ్ల అనే గ్రామంలో 1950 అక్టోబర్ 10న జన్మించారు.ఆయనకు నలుగురు కుమార్తెలున్నారు. ఆయన మొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖలో ఇంజనీరుగా చేసేవారు. ఆ తరువాత నాటకాల మీద మోజుతో అనేక నాటక ప్రదర్శనలు ఇచ్చారు. ఆయనలో ప్రతిభను గుర్తించి దర్శకుడు బాపు ఆయనకు తన సినిమాలలో అవకాశం కల్పించారు. ఆ విధంగా సినీ పరిశ్రమలో ప్రవేశించిన మాడా దాదాపు 300 పైగా సినిమాలలో నటించారు. వాటిలో ముత్యాల ముగ్గు, చిల్లర కొట్టు చిట్టెమ్మ, లంబాడోళ్ళ రాందాసు సినిమాలు ఆయనకు సినీ పరిశ్రమలో గట్టి పునాదివేశాయి. ముఖ్యంగా 1977 సం.లో విడుదలయిన ‘చిల్లర కొట్టు చిట్టెమ్మ’ సినిమాలో పువ్వుల కొమ్మయ్య అనే నపుంసక పాత్రలో ఆయన ప్రదర్శించిన అద్భుత నటన అటువంటి పాత్రలకు ట్రేడ్ మార్క్ గా నిలిచిపోయింది. దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ఆ సినిమాలో ఆయన చేసిన ‘చూడు పిన్నమా…పాడు పిల్లోడు..’అనే పాట ఆయనకు, దానిని పాడిన ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యంకి మంచిపేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో నపుంసకుడిగా వేయడం వలన మాడా ఎంతగా పాపులర్ అయ్యారో అదే పాత్ర ఆయన నటనా జీవితానికి పెద్ద ప్రతిబంధకంగా మారిందని చెప్పవచ్చును. ఆ తరువాత ఆయన చాలా సినిమాలు చేసినప్పటికీ ఆయనకు అదే ట్రేడ్ మార్క్ సినిమాగా నిలిచిపోయింది. అయినప్పటికీ ఆయన అనేక సినిమాలలో విభిన్నమయిన పాత్రలు పోషించి తన ప్రతిభను చాటుకొన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close