చిరు నేతృత్వంలో ఏపీ సీఎం జగన్ ని కలవనున్న సినీ పెద్దలు

కరోనా కారణంగా అన్ని రకాల పరిశ్రమల తో పాటు సినీ పరిశ్రమ కూడా కుదేలు అయిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సడలింపు ల నేపథ్యంలో ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ని కలిసి ఆయన నుండి సానుకూల స్పందన పొందిన సినీ పరిశ్రమ పెద్దలు త్వరలో ఏపీ సీఎం జగన్ ని కలవనున్నారు. వివరాల్లోకి వెళితే..

చిరంజీవి నేతృత్వంలో ఏపీ సీఎం జగన్ ని కలవనున్న సినీ పరిశ్రమ పలు అంశాల ను జగన్ దృష్టికి తీసుకు రానున్నది. ఏపీ లో షూటింగ్ అనుమతులు, సింగిల్ విండో అనుమతుల విధానం, రాయితీలు, పరిశ్రమ కి కావలసిన ప్రోత్సాహకాల విషయంలో సీఎం జగన్ తో చిరంజీవి నేతృత్వంలోని చర్చించనుంది. మొన్నామధ్య ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్స్ అనుమతుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడం కోసం జగన్ ప్రభుత్వం సింగిల్విండో విధానాన్ని తీసుకొస్తూ జీవో విడుదల చేయడం, దానికి చిరంజీవి జగన్ కు అభినందనలు తెలపడం తెలిసిందే. పైగా సినీ పరిశ్రమ ఇటీవల జగన్ తో తమ సమస్యల గురించి చర్చించినప్పుడు చిరంజీవిని బాధ్యత తీసుకోవాల్సిందిగా జగన్ సూచించినట్లు సమాచారం.

మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమకు కావాల్సిన ప్రోత్సాహకాలు, కరోనా కష్టాలనుండి సినీ పరిశ్రమను గట్టెక్కించడానికి తీసుకోవలసిన చర్యల కొరకు జరగనున్న ఈ సమావేశం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అన్నది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close