టాలీవుడ్‌ డ్రగ్స్ కేసుల్లో చార్జిషీట్లు ఇంకా వేయలేదు..!

హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా ఎలా ఉంటుందో గతంలో చాలా సార్లు బయటపడింది. ప్రస్తుతం బాలీవుడ్, శాండల్ వుడ్‌లలో డ్రగ్స్ కలకలం రేపుతోంది. అది ఇంకా టాలీవుడ్ వరకూ రాలేదు. కానీ గతంలో కేసులు మాత్రం చర్చకు వస్తున్నాయి. ఆ కేసులన్నీ ఏమైపోయాయనే అంశంపై… ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ అనే సంస్థ వివరాలు బయటకు లాగాలని ప్రయత్నించింది. సమాచార రక్కు చట్టం కింద… ఎక్సైజ్‌శాఖకి దరఖాస్తు చేసింది. సమాచారం అయితే పంపింది.. కీలక విషయాలు కూడా బయటపెట్టింది… కానీ టాలీవుడ్‌కి సంబంధించిన చిన్న విషయం కూడా చెప్పలేదు. గతంలో జరిగిన విషయాన్ని కూడా చెప్పలేదు. హైదరాబాద్‌లో గత రెండేళ్లలో 12 డ్రగ్స్‌ కేసులు నమోదైనట్లు వెల్లడించిన ఎక్సైజ్‌శాఖ.. ఇప్పటి వరకూ 8 కేసుల్లో చార్జిషీట్‌ వేసినట్లుగా ప్రకటించింది.

చార్జిషీట్లు వేయని నాలుగు కేసులు టాలీవుడ్‌కు సంబంధం ఉన్నవే. అయితే… ఎక్సైజ్‌శాఖ దాఖలు చేసిన 8 చార్జిషీట్లలో సంచలన అంశాలు ఉన్నాయి. డ్రగ్స్ వాడకం దారులు.. పెడ్లర్స్.. జర్మనీ, బ్రిటన్‌, ఇంగ్లాండ్‌ల నుంచి కొరియర్‌ ద్వారా డ్రగ్స్‌ తెప్పించుకుంటున్నారని… ఎక్సైజ్ శాఖ తెలిపింది. విదేశాల నుంచి స్టీల్‌బౌల్స్‌ పేరుతో కొకైన్‌, ఎల్‌ఎస్‌డీని ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకుటున్నారన్నారు. ఎక్సైజ్ శాఖ ఇప్పటి వరకూ దాఖలుచేసిన 8 చార్జిషీట్లలో కళాశాల విద్యార్థులతో పాటు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ కేసులో 72 మంది పేర్లు ఉన్నాయని.. విచారణకు హాజరైన 12 మందితో పాటు మరో 60మందితో జాబితా ఉందని ఎక్సైజ్ శాఖ తెలిపింది.

వారి పేర్లు మాత్రం బయట పెట్టలేదు. రవితేజ సోదరుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు లభించిన ఫోన్ లో దొరికిన సమాచారం ఆధారంగా.. కొంత మంది డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో టాలీవుడ్ డ్రగ్స్ డొంక కదిలిందనుకున్నారు. కానీ తర్వాత సైలెంటయిపోయారు. ఆ సైలెన్స్ ను ఇంకా కొనసాగిస్తున్నారని.. తాజాగా ఎక్సైజ్ శాఖ ఆర్టీఐ కి ఇచ్చిన రిప్లయ్ ద్వారా తేలిపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close