టాలీవుడ్ స‌పోర్ట్‌… టీడీపీ కూట‌మికే!

ఏపీ ఎన్నిక‌ల్లో చిత్ర‌సీమ మొత్తం టీడీపీ కూట‌మి వైపే ఉండే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. జ‌గ‌న్ హ‌యంలో చిత్ర‌సీమ‌కు ఒరిగిందేం లేదు. పైగా అడుగ‌డుగునా అవ‌మానాలు. టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ప‌రిశ్ర‌మ‌తో మంచి అనుబంధం ఉండేది. అది.. జ‌గ‌న్ స‌ర్కారు వ‌చ్చాక పూర్తిగా పోయింది. చాలామంది ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, సంగీత ద‌ర్శ‌కులు.. టీడీపీ కోసం ప‌ని చేశారు. ఇప్ప‌టికీ వాళ్లంతా టీడీపీ వెనుకే ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌లు చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌ర‌గ‌బోతున్నాయి. ప్ర‌తీ చిన్న అంశం.. ఈ ఎన్నిక‌ల్లో కీల‌క‌మే. ముఖ్యంగా ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగాలి. అందుకోసం పాట‌లు, స్కిట్లూ రెడీ చేయాలి. ఇప్ప‌టికే కొంత‌మంది ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, సంగీత ద‌ర్శ‌కులు స్వ‌చ్చందంగా ముందుకు వ‌చ్చి.. టీడీపీ, జ‌న‌సేన కూట‌మి కోసం ప‌ని చేస్తున్నాయి. ఇప్ప‌టికే కొన్ని స్కిట్లు, పాట‌లూ రెడీ అయిపోయాయ‌ని తెలుస్తోంది. ఓ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడి నేతృత్వంలో ఓ టీమ్ ఇందుకోసం రాత్రింబ‌వ‌ళ్లూ క‌ష్ట‌ప‌డుతోంది.

తెలంగాణ ఎన్నిక‌ల్లో రేవంత్ రెడ్డి గెలుపులో.. డిజిట‌ల్ ప్ర‌చారం కీల‌క పాత్ర పోషించింది. అందుకే ఏపీ ఎన్నిక‌ల్లోనూ ప్ర‌ధాన పార్టీలు వీటిపై దృష్టి సారించే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఈ విష‌యంలో వైకాపా ప్ర‌భుత్వం సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్ల‌ని న‌మ్ముకొంది. వీడియోకి ఇంత అంటూ కొంత ఇచ్చి, పెయిడ్ పబ్లిసిటీ చేయించుకొంటున్నారు. టీడీపీ కూట‌మికి ఆ అవ‌స‌రం లేదు. చంద్ర‌బాబుకి స‌న్నిహితులైన ద‌ర్శ‌కులు ఇప్ప‌టికే ఈ కార్య‌క్ర‌మంలో త‌ల‌మున‌క‌లై ఉన్నారు. జ‌న‌సేన‌కు సైతం… చిత్ర‌సీమ‌లో సానుభూతి ఉంది. వాళ్లంతా కేవ‌లం పార్టీపై అభిమానంతో ముందుకు వ‌స్తున్నారు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రావ‌డం ఆల‌స్యం. టీడీపీ కూట‌మి డిజిట‌ల్ ప్ర‌మోష‌న్ల ప‌రంగా త‌న స‌త్తా చూపించ‌డానికి సిద్ధంగా ఉంది. వైకాపా త‌ర‌పున ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయ‌డానికి చిత్ర‌సీమ నుంచి స్టార్ కాంపైన‌ర్లు ఎవరూ లేరు. టీడీపీ, జ‌న‌సేన కూట‌మికి ఈ విష‌యంలో లోటు లేదు. ఈసారి ఎన్నిక‌ల్లో ఎవ‌రెవ‌రు ప్ర‌చారం చేస్తార‌న్న విష‌యంలో ఇంకా ఓ స్ప‌ష్ట‌త లేదు కానీ, ప్ర‌చార ప‌ర్వం మొద‌లయ్యేస‌రికి టాలీవుడ్… టీడీపీ కూట‌మి వెనుకే ఉండ‌డం ఖాయంలా క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లెట్స్ ఓట్ : ఇళ్లు, ఒళ్లు కాపాడుకునే చివరి అవకాశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఏపీ ప్రజలకు ఇది ఓ రకంగా చివరి అవకాశం. ఇళ్లు, ఒళ్లు కాపాడుకునేందుకు వచ్చిన చివరి అవకాశం. గతంలో ఎవరు అధికారంలోకి వస్తే ఏమవుతుందిలే...

ప్రారంభమైన పోలింగ్…బరిలో ప్రముఖులు వీరే..!

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా కాసేపటి క్రితం నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంట్ సెగ్మెంట్లలో సోమవారం పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలోని మొత్తం 17, ఏపీలోని...

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close