త్రివిక్రమ్ పంథాయే కరెక్ట్!

హైదరాబాద్: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – నితిన్, సమంతలతో ‘అ ఆ'(అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) అనే కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. టైటిల్ చూడగానే ఈ సినిమాలో నిర్దిష్టమైన కథ ఏదో ఉందని, సాధారణంగా చుట్టేసే రొటీన్ సినిమా కాదని అర్థమవుతోంది. అత్తారింటికి దారేది చిత్రంతో టాలీవుడ్ టాప్ రేంజ్ డైరెక్టర్లలోకి చేరుకున్న త్రివిక్రమ్, ఇప్పుడు ఒక సినిమా చేస్తానంటే మన టాప్ హీరోలందరూ కాల్‌షీట్‌లు ఇవ్వటానికి ముందుంటారనేది అతిశయోక్తి కాదు. దానికి కారణాలు – త్రివిక్రమ్ సక్సెస్ రేట్ బాగుండటం ఒకటైతే, అతని సినిమాల వలన కుటుంబ చిత్రాల ప్రేక్షకులలో పాగా వేయొచ్చనేది రెండోది. అయితే ఇంత క్రేజ్ ఉన్నాకూడా త్రివిక్రమ్ ఇప్పుడు బి గ్రేడ్ హీరో అయిన నితిన్‌తో సినిమా చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

త్రివిక్రమ్ ఈ సినిమా చేయటానికి కారణం అతను బలంగా నమ్ముకున్న స్టోరీ పాయింట్ అని టైటిల్‌నుబట్టే అర్థమవుతోంది. డిమాండ్ ఉందని, ఎక్కువ రెమ్యునరేషన్ వస్తుందని కథకు నప్పని టాప్ హీరోతో ఆ చిత్రాన్ని చేస్తే అది బాక్సాఫీస్ దగ్గర పేలిపోవటం ఖాయం. ఆ కథకు నితిన్ కరెక్ట్ కాబట్టే త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. సాధారణంగా ఒకటి-రెండు సినిమాలు హిట్ కాగానే, దర్శకులు ఎడా పెడా సినిమాలు ఒప్పుకొంటుంటారు. అయితే త్రివిక్రమ్ అలా చేయటంలేదు. డిమాండ్‌ను క్యాష్ చేసుకుందామని పెద్ద హీరోలతో హడావుడిగా చేయకుండా నింపాదిగా తనకు తట్టిన స్టోరీ పాయింట్‌తో సినిమాను రూపొందించుకుంటూ వెళుతున్నారు. తద్వారా తన క్రియేటివిటీని ఆయన కాపాడుకుంటున్నారు. ఆయన మార్గం అభినందనీయం.

‘అ ఆ’ టైటిల్‌ను బట్టి హీరోయిన్ పేరు అనసూయ, ఆమె తండ్రి పేరు రామలింగం అని, హీరో పేరు ఆనంద్ విహారి అని తెలుస్తోంది. అసలు ఈ మధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాల టైటిల్స్ అన్నీ టాలీవుడ్ సంప్రదాయాల ప్రకారం ‘బాద్షా’, ‘నాయక్’, ‘దూకుడు’ వంటి హీరో బేస్డ్‌వి కాకుండా భిన్నంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి ఇలాగే భిన్నంగా ఉండాగా ఇప్పుడు ‘అ ఆ’ కూడా ఆ పద్ధతిలోనే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close