పార్లమెంటులో కూడా సీట్ బెల్ట్ కోసం వెతుకొంటారు మోడీ!

జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య విమర్శలు కూడా పెరుగుతున్నాయి. తెరాస మంత్రి కె.తారక రామారావు నేరుగా ప్రధాని నరేంద్ర మోడి మీదనే విమర్శలు గుప్పిస్తున్నారు. నిత్యం విమానాలలో తిరగడం అలవాటయిపోయిన కారణంగా ఆయన పార్లమెంటులో కూర్చోనప్పుడు కూడా సీట్ బెల్టు కోసం వెతుకొంటారు, అని ఎద్దేవా చేసారు. తెలంగాణా రాష్ర్టం ఏర్పడి ఇప్పటికి 18 నెలలు అయినప్పటికీ ఇంతవరకు ఆయనకి తెలంగాణా వచ్చేందుకు తీరిక, ఆసక్తి లేవని కానీ నిత్యం విదేశాలు తిరుగుతుంటారని విమర్శించారు.

కె.తారక రామారావు నిన్న ధూల్ పేటలోని జుమ్మేరాత్‌ బజారులో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడిని విమర్శించడమే కాకుండా రాష్ట్ర బీజేపీ నేథలకి కూడా సవాలు విసిరారు. ఎవరూ అడగకపోయినా బీహార్ కి 1.25 లక్షల కోట్లు ఆర్ధిక ప్యాకేజి, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి రూ.80, 000 కోట్ల ప్యాకేజి ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడి తెలంగాణాకు ఎందుకు పైసా విదిలించడం లేదు? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిలకు దమ్ముంటే నరేంద్ర మోడీ వద్దకు వెళ్లి తెలంగాణా రాష్ట్రానికి కూడా లక్ష కోట్లు ఆర్ధిక ప్యాకేజి అడిగి తీసుకురావాలి అని సవాలు విసిరారు. తమ పార్టీ బీజేపీలాగ హామీలు ఇచ్చి మరిచిపోయే పార్టీ కాదని అన్నారు. ధూల్ పేట ప్రజల కోసం ఆ ప్రాంతంలో ఒక పెద్ద పరిశ్రమను నెలకొల్పబోతున్నట్లు కె.తారక రామారావు ప్రకటించారు.

ప్రధాని నరేంద్ర మోడిపై కె.టి.ఆర్. చేస్తున్న విమర్శలను కేంద్ర కార్మిక, పెట్రోలియం శాఖా మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, బండారు దత్తాత్రేయ తప్పు పట్టారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి జన్మదినం సందర్భంగా నిన్న హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన విస్తృతస్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి ధర్మేన్ ప్రాధాన్ మాట్లాడుతూ “కె.టి.ఆర్. ముఖ్యమంత్రి కుమారుడు అయినంత మాత్రాన్న ఆయన అంత అహంకారం ప్రదర్శించడం మంచి పద్దతి కాదు. ప్రధాని మోడిని విమర్శించేముందు, మీ తండ్రి కేసీఆర్ వారంలో ఎన్నిసార్లు సచివాలయానికి వస్తున్నారో తెలుసుకోవాలని అన్నారు. ఒకవేళ ప్రధాని మోడీ ఏమి చేస్తున్నారో కె.టి.ఆర్.కి తెలియకపోతే, తన తండ్రి కేసీఆర్ ని అడిగి తెలుసుకొంటే మంచిది,” అని హితవు పలికారు.

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ “రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ పధకాలకు కేంద్రమే నిధులు అందిస్తోందనే విషయం మంత్రి కె.టి.ఆర్.కి తెలియదా? తెలంగాణా ప్రభుత్వం అడగగానే నిరంతర విద్యుత్ సరఫరా పధకం మంజూరు చేసిన సంగతి ఆయనకి తెలియదా?ఎంఎంటీఎస్‌ రెండో దశను పూర్తి చేయడానికి కేంద్రం నిధులు మంజూరు చేస్తున్న విషయం ఆయనకీ తెలియదా? కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఇంత చేస్తుంటే కె.టి.ఆర్. నోటికి వచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోడిని విమర్శించడం తగదు,” అని హితవు పలికారు. జి.హెచ్.ఎం.సి.ఎన్నికలలో తెదేపా, బీజేపీ కూటమిని గెలిపించినట్లయితే కేంద్రం హైదరాబాద్ ని అభివృద్ధి చేస్తుందని బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

సూర‌త్ ఎన్నిక వెనుక జ‌రిగింది ఇదేనా?- బీజేపీలోకి కాంగ్రెస్ అభ్య‌ర్థి

క‌మ‌ల వికాసం మొద‌లైపోయింది. సూర‌త్ లో బీజేపీ అభ్య‌ర్థి గెలుపుతో మొద‌లైన ఈ హ‌వా 400సీట్ల‌కు చేర‌కుంటుంద‌ని బీజేపీ సంబురాలు చేసుకుంటుంది. అనైతిక విజ‌యం అంటూ కాంగ్రెస్ విరుచుక‌ప‌డుతుంటే, నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణకు గురైన...

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close