టీఆర్ఎస్ – బీజేపీ ఎంపీల “నిధుల” ఫైట్..!

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎన్ని నిధులిచ్చింది..? ఎంత ఖర్చు పెట్టారు..? ఇప్పుడు ఇది బీజేపీ, టీఆర్ఎస్ ఎంపీల మధ్య మాటల మంటలకు కారణం అవుతోంది. తెలంగాణలో కరోనా కట్టడికి రూ. 290 కోట్లు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చారు. అంతకు ముందు రోజు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ .. తెలంగాణకు కేంద్రం రూ. ఏడు వేల కోట్లు ఇచ్చిందని ప్రకటన చేశారు. ఈ రెండు ప్రకటనలను ఒకే ట్వీట్‌లో పెట్టిన కేటీఆర్… బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక బీజేపీ ఎంపీలు ఊరుకుంటారా..? రంగంలోకి దిగి.. విమర్శల వర్షం అందుకున్నారు.

కేటీఆర్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ.. మొదట విమర్శల వర్షం అందుకున్నారు. బండి సంజయ్ చెప్పింది.. కరోనా సమయంలో… కేంద్రం తెలంగాణ అందించిన సాయం వివరాలని.. ఒక్క కరోనా కట్టడికి మాత్రమే కాదని..అరవింద్ ప్రకటించారు. ఈ వివరాలను చెప్పకుండా కేటీఆర్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా కాలంలో పీఎం కిసాన్‌ , జనధన్‌ , ఉజ్వల పథకం , భవన నిర్మాణ కార్మికులకు సాయం, పెన్షన్లు, ఉపాధి హామీ పథకం, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఆహార భద్రత పథకం కింద మొత్తం ఇచ్చిన నిధుల వివరాలను బండి సంజయ్ వెల్లడించారు. అంతే కాదు.. కరోనా కట్టడి కోసం.. కేంద్రం రూ. 290 కోట్లు ఇస్తే తెలంగాణ సర్కార్ ఆ నిధుల్లోనూ కేవలం రూ. 160 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని లెక్కలు బయట పెట్టారు.

అయితే.. అరవింద్ విమర్శలపై టీఆర్ఎస్ భగ్గు మంది. అరవింద్‌కు సంస్కారం లేదని.. మండిపడ్డారు. రూ. 290 కోట్లు మాత్రమే ఇచ్చామని స్వయంగా కేంద్ర మంత్రి చెబితే.. బీజేపీ నేతలు మాత్రం ఏడు వేల కోట్లిచ్చారని అబద్దాలు చెబుతున్నారని అంటున్నారు. ఈ మాటల మంటలు అలా కొనసాగుతూనే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నేతలు పన్నుల రూపంలో ఇవ్వాల్సిన వాటను కూడా…. ఏదో కేంద్ర సాయం అన్నట్లుగా చెబుతూండటంతో సమస్య వస్తోంది. తెలంగాణ నుంచి పన్నులు వసూలు చేస్తున్నారన్న విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ముందు ముందు ఈ నిధుల ఫైట్ మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. ఒకరిని మించి ఒకరు ఘాటు విమర్శలు చేసుకోవడానికి వెనుకాడటం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close