షర్మిలకు మంచి మైలేజీ ఇచ్చిన టీఆర్ఎస్ !

వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలకు.. టీఆర్ఎస్ సర్కార్ మంచి మైలేజీ ఇచ్చింది. ఆమె పాదయాత్రను ప్రజలు ఎవరూ పట్టించుకోవడం లేదు. భారీగా ఖర్చు పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నారు. స్వచ్చందంగా వచ్చే ప్రజలు లేరు. ఆ విషయం టీఆర్ఎస్‌కూ తెలుసు. అయినా సరే.. ఆమె అసభ్యంగా మాట్లాడుతున్నారని చెప్పి నర్సంపేటలో దాడులు చేశారు. తర్వాత హైదరాబాద్‌లో “షో” చేయడానికి అవకాశం కల్పించారు. ఇది ఎంత అంటే… రోజంతా ఉండేలా చూసుకున్నారు. షర్మిలను రోడ్డుపై నుంచే కారుతో సహా లిఫ్ట్ చేయడం.. . విజయలక్ష్మి రోడ్డుపై ధర్నా… బ్రదర్ అనిల్ భర్త సెంటిమెంట్.. చివరికి కోర్టు.. బెయిల్.. అంతా.. ఓ రేంజ్‌లో ఎలివేషన్లు ఇచ్చారు.

నిజానికి ఆమెను ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసి ఉంటే.. ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ టీఆర్ఎస్ వ్యూహాత్మకంగానే షర్మిలకు మైలేజీ ఇచ్చిందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. పాదయాత్రను ఆపేస్తే కోర్టు ఎలాగూ అనుమతిస్తుంది. ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు చేయకుండా ప్రభుత్వాలు అడ్డుకోలేవు. అయినా ఇంత చేయడానికి టీఆర్ఎస్ సర్కార్ అనుమతిచ్చి..షర్మిలకు మేలు చేసింది. రాజకీయపార్టీ పెట్టినప్పటి నుండి.. షర్మిలకు ఈ స్థాయిలో మీడియా కవరేజీ ఎప్పుడూ రాలేదు. ఇది గుడ్ స్టార్ట్ అనుకుని ఆమె పోరాటం చేసే చాన్స్ ఉంది.

ప్రభుత్వ వ్యతిరేక ఓటును.. చీల్చే శక్తి ఎవరికి ఉన్నా.. వారికి ఎంతో కొంత మద్దతు ఇచ్చేలా టీఆర్ఎస్ చూసుకుంటోంది. రెండు శాతం ఓట్లు చీల్చినా.. అది చాలా తేడాకు కారణం అవుతుంది. టీఆర్ఎస్‌కు అది చాలా ముఖ్యం . అందుకే షర్మిలకు ఎలివేషన్లు ఇస్తున్నారని అంటున్నారు. కారణం ఏదైనా.. షర్మిలకు మాత్రం .. రాజకీయంగా ఈ మంగళవారం.. ఎంతో ప్లస్ అయిన రోజు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టైటిల్ దొరకలేదా త్రివిక్రమ్ ?

ఉగాదికి కొత్త సినిమా కబుర్లతో టాలీవుడ్ సందడిగా మారింది. కొత్తగా ప్రారంభమైన సినిమాలతో పాటు సెట్స్ పై వున్న చిత్రాలు వరుస అప్డేట్ లతో ఫ్యాన్స్ ని ఖుషి చేశాయి. అయితే మహేష్...

పవన్ పని వారం రోజులే…

డేట్లు ఇచ్చే ముందు కాస్త ఆలోచిస్తారు కానీ ఒకసారి డేట్లు ఇచ్చిన తర్వాత చాలా వేగంగా పని చేస్తారు పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్ కూడా ఇలానే చాలా ఫాస్ట్ గా...

క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారిపై సరైన సమయంలో చర్యలు : సజ్జల

వైసీపీ నుంచి టీడీపీకి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారెవరో గుర్తించామని కానీ వెంటనే చర్యలు తీసుకోబోమని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. వెంటనే చర్యలు...

ఖుషీ.. ఏమిటా రెండు ప్రపంచాలు ?

నిన్ను కోరి, మజిలీ చిత్రాలతో సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు శివనిర్వాణ. ఇప్పుడు విజయ్ దేవరకొండ, సమంత తో ఖుషీ సినిమా రూపొందిస్తున్నాడు. సెప్టెంబర్ 1న రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close