మల్లారెడ్డిలా ఇరుక్కుపోలేమంటున్న టీఆర్ఎస్ నేతలు !

కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడి చేస్తే ఎదురుదాడి చేయండి అని కేసీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ ఇచ్చిన ధైర్యంతో… మల్లారెడ్డి అదే చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు చేస్తే ఎలా చేస్తాయో.. రాజకీయ నేతలకు బాగా తెలుసు. రాజకీయ ఒత్తిడితో సోదాలు చేసినా వారి పని వారు చేసుకెళ్తారు కానీ… తప్పుడు లెక్కలు.. సాక్ష్యాలతో ఇరికించే ప్రయత్నం చేయరు. కానీ మల్లారెడ్డి మాత్రం కేసీఆర్ చెప్పారని వారిపై ఆరోపణలు చేశారు.. కొట్టారన్నారు. కేసులు కూడా పెట్టారు. ఇప్పుడు ఆయన మరింతగా కూరుకుపోయారన్న వాదన వినిపిస్తోంది. ఆయన విద్యాసంస్థలకు గండం పొంచి ఉందని గుసగుసలాడుకుంటున్నారు.

మల్లారెడ్డిలాగే తాము చేస్తే ఇరుక్కుపోతామని ఎక్కువ మంది టీఆర్ఎస్ నేతలు సైలెంట్‌గా ఉంటున్నారు. గంగుల కమలాకర్‌ ఇంటిపై ఈడీ దాడులు చేసినాఆయన ఎక్కడా నోరు జారలేదు. ఆయన ఇంటి తాళాలు పగులగొడితే.. తానే పగలగొట్టమని చెప్పానని కవర్ చేసుకున్నారు. ఈడీ అధికారులపై ఒక్కమాట కూడా మాట్లాడలేదు. దర్యాప్తునకు సహకరిస్తామన్నారు. ఇతరులూ అంతే. ఐటీ , ఈడీ అధికారులపై తిరుగబడిన వారు లేరు. కానీ మల్లారెడ్డి మాత్రం తొడకొట్టినంతపని చేశారు. దీంతో ఆయన మరింతగా టార్గెట్ అయ్యారు.

కెసిఆర్ మా వెనక ఉన్నారు.. ఆయన మాటే శిరోధార్యమని భావించిన నేతలు ఇప్పుడు మల్లారెడ్డి ఎపిసోడ్ చూసి కాస్త భయపడుతున్నారు. అనవసరంగా కేంద్ర దర్యాప్తు సంస్థ లతో పెట్టుకుంటే ముందు ముందు మరిన్ని ఇబ్బందులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదని భయపడుతున్నారు. సీఎం కేసీఆర్ మాటలు విని మల్లారెడ్డి అనవసరంగా ఐటి అధికారులతో పంచాయితీ పెట్టుకున్నారు అన్న చర్చ గులాబి నేతల్లోనూ వ్యక్తమౌతుంది. ఒకవేళ ఐటి దాడులు జరిగినా, ఈడీ దాడులు జరిగినా ఎదురుతిరిగి ఇష్యూని కాంప్లికేట్ చేసుకునే బదులు, సైలెంట్ గా అధికారులకు సహకరిస్తే పోతుందని చర్చ జరుగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close