కేసీఆర్ ప్రధాని అయితే ప్రజలకు సమస్యలే ఉండవట..!

మీకు ఆరోగ్య సమస్యలేమీ ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి..?. జిందాతిలిస్మాత్ వాడండి..! అనే ప్రకటన చాలా సార్లు చూసి ఉంటాం. ఇదే తరహాలో.. దేశంలో ప్రజలందరికీ ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి..? . ఏమీ చేయక్కర లేదు.. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ను ప్రధానమంత్రిని చేస్తే చాలు. దేశంలో ఉన్న ప్రజల సమస్యలన్నీ మటుమాయం అయిపోతాయి. ఇలా చెప్పింది ఎక్కడో కాదు.. తెలంగాణ అసెంబ్లీలో.. చెప్పింది ఎవరో కాదు.. కేసీఆర్ కేబినెట్‌లోని మంత్రి మల్లారెడ్డి. అసలు దేశంలోని ప్రజల సమస్యలేమిటో… వాటికి పరిష్కారం.. కేసీఆర్ ప్రధాని కావడం అని మల్లారెడ్డి ఎందుకనుకున్నారో తోటి సభ్యులకు అర్థం కాలేదు కానీ.. పొగిడింది కేసీఆర్‌ను కాబట్టి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చప్పట్లు కొట్టారు.

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనను కేసీఆర్ ఇప్పటికి విరమించుకున్నారన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో మల్లారెడ్డి .. మళ్లీ కేసీఆర్ ప్రధాని అనే వాదనను అసెంబ్లీలోనే తీసుకొచ్చారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల వరకూ హడావుడి చేశారు. ఆ సమయంలో… గ్రేటర్ ఎన్నికలు ముగియగానే బీజేపీయేతర పార్టీల సమావేశం ఉంటుందని.. తాను అందరితో మాట్లాడానని చెప్పారు. అయితే గ్రేటర్ ఎన్నికలు ముగియగానే ఆయన బీజేపీతో రణం లేదు.. రాజీ లేదు అనే ఫార్ములా అవలంభించారు.

దీంతో ఆయన వెనక్కి తగ్గిపోయారని అందరికీ క్లారిటీ వచ్చింది. కానీ మల్లారెడ్డి మాత్రం.. మళ్లీ కేసీఆర్ ప్రధాని అనే వాదనను అసెంబ్లీలోనే తీసుకు వచ్చారు. అయితే మల్లారెడ్డి వ్యాఖ్యలు సీరియస్‌గానా.. లేకపోతే.. ఆయన స్టైల్లోనే అనేసి ఉంటారా అన్న చర్చ జరుగుతోంది. ఎదుకంటే.. కేసీఆర్‌ను పొగడటంతో ఎవరి స్టైల్ వారిది. మల్లారెడ్డి స్టైల్ మల్లారెడ్డిదని .. సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని.. కొంత మంది టీఆర్ఎస్ నేతలే అనుకుంటూ ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close