సాగర్‌లో కారుదే జోరు..! లెక్కలోలేని బీజేపీ..!

గెలిచేస్తారు.. గెలిచేస్తారు.. అని అందరూ మునగచెట్టు ఎక్కించేయడంతో కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి … నాగార్జున సాగర్ బరిలో నిలిచారు. మొదట్లో తాను ఒంటరిగా గెలిచి.. ఒంటిచేత్తో గెలిచి..కాంగ్రెస్ తానొక్కడినే మొగోడ్ని అని నిరూపించుకోవాలని తాపత్రయపడ్డారు.కానీ ఇప్పుడు ఫలితం తేడా వచ్చింది. దీంతో ఇప్పుడు జానారెడ్డి కలలన్నీ కల్లలైపోయాయి. నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి… చనిపోయిన నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ విజయం ఖాయమయింది. జానారెడ్డి సొంత మండలం అనుమలలో కూడా.. ఆయనకు మెజార్టీ దక్కలేదు. బీజేపీని అణగదొక్కడానికి.. కాంగ్రెస్‌ను కేసీఆర్ గెలిపిస్తారన్న ప్రచారం కూడా అంతా ఉత్తదేనని తేలిపోయింది.

నోముల నర్సింహయ్య చనిపోయిన తర్వాత టీఆర్ఎస్ అక్కడ వ్యూహాత్మకంగా పని చేసింది. కేసీఆర్ ప్రతి మండలానికి ఎమ్మెల్యే స్థాయి నేతల్ని నియమించి ప్రచారాన్ని హోరెత్తించారు. ఖర్చు విషయంలో ఎవరూ రాజీపడలేదు. అనుకున్నది అనుకున్నట్లుగా వారు పని చేసి పెట్టారు. అయితే కాంగ్రెస్ వైపు నుంచి ముందుగానే అభ్యర్థిని ఖరారు చేసినా.. టీమ్ వర్క్ లేదు. జానారెడ్డి.. తన నియోజకవర్గంలో ఇతరులు వేలు పెట్టడానికి మొదట్లో అంగీకరించకపోవడంతో ఎవరూ ప్రచారం చేయలేదు. చివరి దశలో పరిస్థితిని గమనించి… నేతలందరూ వచ్చినా ప్రయోజనం లేకపోయింది. కాంగ్రెస్‌కు మరోసారి ఓటమి తప్పలేదు.

ఇక దున్నిపడేస్తామని ఆశలు పెట్టుకున్న బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు.. రెండు వేల ఓట్లు వస్తే.. ఈ సారి అనేక మంది నేతల్ని చేర్చకున్నా.. ఆ ఓట్లకు మరో మూడు, నాలుగు వేల ఓట్లు మాత్రమే జమవుతాయని ట్రెండ్స్ చెబుతున్నాయి. సాగర్ ఉపఎన్నికల్లో గెలిచి… తమది వాపు కాదు బలుపు అని నిరూపించాలనుకున్న బీజేపీకి చుక్కెదురయింది. దుబ్బాక.. గ్రేటర్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల గాలి అంతా పోయినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

తిరుమ‌ల‌లో ప్ర‌క్షాళ‌న మొద‌లు… మంచి రోజులొచ్చిన‌ట్లే!

తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నం అంటే దేశ‌, విదేశాల నుండి వ‌స్తుంటారు. ఉత్త‌రాధి నుండి తిరుమ‌ల‌కు ఒక్క‌సారి వెళ్లి రావాల‌న్న వారు అధికంగా ఉంటారు. వెంక‌టేశ్వేర స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ఎంత క‌ష్ట‌మైన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close