భారత్ లో ప్లాంట్ పెట్టడానికి సిద్ధమైన ఎలాన్ మస్క్ చివరి క్షణంలో వెనుకడుగు వేశారు. షోరూంలు పెట్టి కార్లు మాత్రమే అమ్మాలనుకుంటున్నారని కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటించారు. పరిశ్రమ పెట్టేందుకు మొదటి సారి సమావేశానికి టెస్లా బృందం వచ్చింది. కానీ తర్వాత సమావేశాలకు హాజరు కాలేదు. దీంతో టెస్లాకు ప్లాంట్ పెట్టే ఉద్దేశం లేదని స్పష్టమయింది.
విద్యుత్ కార్ల ఉత్పత్తికి కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించింది. దీంతో టెస్లా వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఈ విషయం తెలిసిన తర్వాత ట్రంప్.. ఇండియాలో టెస్లా కార్ల ఫ్యాక్టరీ పెట్టాల్సిన అవసరం లేదని బహిరంగంగానే చెప్పారు. ట్రంప్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మస్క్ తన నిర్ణయం మార్చుకున్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం ఆయన ఇక అమెరికా బయట ప్లాంట్లు పెట్టే అవకాశం లేదు.
అయితే దిగుమతి చేసిన విద్యుత్ కార్లను ఇండియాలో అమ్మేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. గతంలో ఇలా అమ్మే విషయంలో సుంకాలు తగ్గించేందుకు కేంద్రం అంగీకరించలేదు. తయారు చేసి అమ్మాలనే కండిషన్ పెట్టింది.కానీ ఇప్పుడు సుంకాల వార్ లో .. భారత్ విద్యుత్ కార్లపై సుంకాలు తగ్గించే అవకాశాలు ఉండటంతో అమ్మకాలు చేసుకోవచ్చని మస్క్ భావిస్తున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా టెస్లా కార్లకు డిమాండ్ తగ్గిపోతోంది.