టీటీడీ ఈవోకు నెల జైలు !

దేవుడి సన్నిధిలో పవిత్రమైన విధులు నిర్వహిస్తూ… వ్యవస్థల్ని ధిక్కరిస్తున్నారు అధికారులు. నేరుగా ఈవోనే కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో చివరికి హైకోర్టు నెల రోజుల జైలు శిక్ష.. రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. జరిమానా కట్టకపోతే.. మరో వారం రోజులు జైల్లో ఉండాలని ఆదేశించింది. తమను రెగ్యులరైజ్ చేయాల్సి ఉన్నా.. ఉ్దదేశపూర్వకంగా చేయడం లేదని గతంలో ముగ్గురు టీటీడీ ఉద్యోగులు కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. ముగ్గుర్ని రెగ్యులరైజ్ చేయాలని ఆదేశించింది.

అయితే నెలలు గడిచిపోతున్నా.. టీటీడీ ఈవో మాత్రం ఈ తీర్పును పట్టించుకోలేదు. ఆ ఉద్యోగులు వేచి చూసి చూసి.. చివరికి మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఈవోకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. నిజానికి ఏపీలో అధికారులపై కొన్ని వేల కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. అయితే ఇవన్నీ బిల్లులకు సంబంధించినవి. ప్రభుత్వానికి పనులు చేశామని బిల్లులు ఇవ్వలేదని .. కోర్టుకెక్కి.. అనుకూలమైన తీర్పు వచ్చినా అమలు చేయలేదని ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేసేవే.

అయితే ఇప్పుడు టీటీడీ ఈవో కు మాత్రం అలాంటి కేసు కాదు. ఉద్దేశపూర్వకంగా ఆ ఉద్యోగుల్ని క్రమబద్దీకరించడంలేదు. హైకోర్టు చెప్పినా చేయలేదు. ఎందుకు చేయలేదో కోర్టుకు చెప్పుకోవాల్సింది. అలా కూడా చెప్పుకున్నట్లుగా లేరు. ఉద్దేశపూర్వకంగా హైకోర్టును నిర్లక్ష్యం చేసినట్లుగా స్పష్టం కావడంతో.. జైలు, జరిమానా విధించింది. గతంలో చాలా మంది అధికారులకు శిక్ష పడింది కానీ.. వారు డివిజన్ బెంచ్‌కు.. వెళ్లి స్టే తెచ్చుకున్నారు. బహుశా ధర్మారెడ్డికూడా అదే చేయవచ్చు. కానీ ఆయనకు పడిన శిక్ష మాత్రం రికార్డుల్లో ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close