“జియో మార్ట్‌” ద్వారా టిక్కెట్లమ్మారని చెబితే దుష్ప్రచారమా !?

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తాము చేసిన పనులను మీడియా చెప్పినా దుష్ప్రచారం .. కేసులు పెడుతామంటూ హెచ్చరికలు చేయడం ప్రారంభించారు. శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లను జియో మార్ట్ ద్వారా అమ్మడం నిజం. టీటీడీ వెబ్ సైట్‌ను క్లిక్ చేస్తే జియో మార్ట్‌కు మైగ్రేట్ అవడం కూడా నిజం. టీటీడీ అధికారులు చెప్పినట్లుగా కోటి మంది టిక్కెట్ల కోసం ప్రయత్నించారు. అంటే టీటీడీ భక్తులకు తమకు అవసరం లేకపోయినా జియో మోర్ట్‌ వెబ్ సైట్‌ను కోటి సార్లు ఓపెన్ చేశారు. టీటీడీ తమ భక్తులను ఇలా జియో మార్ట్‌కు అప్పగించిందని విమర్శలు వచ్చాయి.

దీన్ని టీటీడీ పాలనాధికారులు ఖండించారు. దుష్ప్రచారం చేస్తున్నారని కేసులు పెడుతామని చెప్పుకొచ్చారు. నిజంగానే జియో మార్ట్ కు టిక్కెట్ల బాధ్యత అప్పగించినట్లుగా ఒప్పుకున్నారు. మరి ఏమని కేసులు పెడుతారు. ఎందుకు ఇచ్చారంటే శ్రీవారి భక్తులు ఉచితంగా సేవ చేస్తామంటే ఇచ్చామని చెబుతున్నారు. కోటి మంది శ్రీవారి భక్తుల్ని జియోమార్ట్ ఖాతాదారులుగా మార్చేసిన టీటీడీ… వారు ఉచిత సేవ చేస్తారంటే ఎవరు నమ్ముతారు. శ్రీవారి భక్తుల ఫోన్ నెంబర్లు.. ఏకంగా కోటి జియోమార్ట్ డేటాలో చేరిపోలేదా ?. ఇంకా క్లౌడ్ సేవలు.. రూ. మూడు కోట్లు అని టీటీడీ అధికారులు కబుర్లు కాస్త విలువవైనవే చెబుతున్నారు.

కానీ అలా ఇవ్వడానికి కూడా ఓ పద్దతి ఉంటుంది కదా అని ప్రశ్నిస్తున్నారు భక్తులు. అయితే తమ తప్పిదాలు.. స్కాంలను ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేసి కేసులు పెట్టడం అన్న ఒకే ఒక్క ఆప్షన్‌ను ప్రస్తుత పాలకులు అమలు చేస్తున్నారు. అదే బెదిరింపులకు దిగుతున్నారు. చేసింది చెప్పినా దుష్ప్రచారం అంటున్నారంటే ఖచ్చితంగా వారు చేసిందని తప్పని వారు అంగీకరించడమనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close