తిరుమలలో కరోనా తిష్ట.. పెద్దజీయంగార్‌కు పాజిటివ్..!

తిరుమల శ్రీవారి ఆలయంలో అర్చకులకు కరోనా వైరస్ అంటుకుంది. ఇప్పటికి పధ్నాలుగు మంది అర్చకులకు పాజిటివ్‌గా తేలిందని.. మరో పాతిక మంది ఫలితాలు రావాల్సి ఉందని రమణదీక్షితులు ప్రకటించి కలకలం రేపారు. ఆయన దర్శనాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. దానిపై.. టీటీడీ చైర్మన్ ఫైరయ్యారు. దర్శనాలు నిలిపివేసే ప్రసక్తే లేదన్నారు. అయితే.. ఈలోపే.. షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. శ్రీవారి పూజా కైంకర్యాలను పర్యవేక్షించే పెద్ద జియ్యంగార్‌కు.. కరోనా పాజిటివ్‌గా తేలింది. టీటీడీలో మిరాశీ విధానం రద్దయిన తర్వాత కైంకర్యాలు నిర్వహించే బాధ్యత జీయంగార్లకు దక్కింది. చిన జియ్యంగార్, పెద్ద జియ్యంగార్ ఉంటారు. మొత్తం వారి చేతుల మీదుగానే సుప్రభాతం సహా.. వివిధ కైంకర్యాలు జరగాలి. ఇప్పుడు పెద్ద జియ్యంగార్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.

పెద్ద జియ్యంగార్.. నిన్న కూడా.. శ్రీవారి కైంకర్య విధుల్లో చురుకుగా పాల్గొన్నారు. గురువారం సాలకట్ల ఆణివార ఆస్థానం ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. ఆయనతో పాటు చిన్నజీయర్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో సింఘాల్‌, అదనపు ఈవో ధర్మారెడ్డి, ఇతర అధికారులు పెద్ద జీయర్‌ తోపాటు కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ఇప్పుడు అందరూ క్వారంటైన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్దజీయర్ కాంటాక్టులందరూ.. టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఓ వైపు రమణదీక్షితులు.. పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని.. బయట పెట్టిన సమయంలోనే.. పెద్ద జీయర్‌కు పాజిటివ్‌గా రావడం.. టీటీడీ బోర్జు పెద్దలకు భారీ షాక్‌లా మారింది.

తిరుమల కొండకు వస్తున్న భక్తులకు ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్ రాలేదని… టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇప్పటి వరకూ 140మందికిపైగా ఉద్యోగాలు కరోనా బారిన పడ్డారు. వారందరికీ ఎలా సోకిందన్న ప్రశ్నలు ఇతరుల వైపు నుంచి వస్తున్నాయి. భక్తుల నుంచే.. అర్చకులకూ సోకి ఉంటుందని..అంటున్నారు. ఇప్పుడు.. టీటీడీ దర్శనాల నిలిపివేతపై… తక్షణం చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్ద జియ్యంగార్‌కు కరోనా వచ్చిన తర్వాత దర్శనాలు కొనసాగించే పరిస్థితి ఉండదని.. టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్ రెడీ!

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్‌! చాలాకాలంగా ప‌వ‌న్ అంటే రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యాలే గుర్తుకు వ‌స్తున్నాయి. ఆయిన పాలిటిక్స్ తో అంత బిజీ అయ్యారు. అందుకే సినిమాల‌కు గ్యాప్ ఇచ్చారు. ఎన్నిక‌లు...

తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ముగ్గురూ ఒక్క‌డే!

తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అధిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'గుడ్ - బ్యాడ్ - అగ్లీ'...

నాగ‌శౌర్య‌కు ఏమైంది..?

టాలీవుడ్ లో హీరోలంతా య‌మా బిజీగా ఉన్న ద‌శ ఇది. చేతిలో ఒక‌టీ అరా విజ‌యాలు ఉన్న 'యావ‌రేజ్' హీరోలు సైతం.. త‌మ ఆధిప‌త్యం చూపిస్తున్నారు. చేతి నిండా సినిమాల‌తో హ‌డావుడి చేస్తున్నారు....

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close