మీడియా వాచ్ : రేవంత్ కోసం మళ్లీ అరగంట కేటాయిస్తున్న టీవీ9..!

పీసీసీ అధ్యక్షుడి ప్రకటన రేపో మాపో ఉంటుందని ఢిల్లీ నుంచి సంకేతాలు వస్తున్నాయేమో కానీ.. మళ్లీ టీవీ 9లో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అరగంట కథనాలు ప్రారంభమయ్యాయి. గతంలో కర్ణాటకకు పీసీసీ అధ్యక్షుడిగా శివకుమార్‌ను నియమించిన సందర్భంలోనే రేవంత్ రెడ్డిని కూడా నియమిస్తారని చెప్పుకున్నారు. అయితే అప్పుడే రేవంత్ రెడ్డిని డ్రోన్ కేసులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత టీవీ9లో కరోనాను మించి రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తూ కవరేజీ ఇచ్చారు. అనేకానేక ఆరోపణలు అరంగటలు.. అరగంటలు స్పెషల్ స్టోరీస్ ఇచ్చారు. ఆ తర్వాత సైలెంటయ్యారు. మళ్లీ ఇప్పుడు టీవీ9 రేవంత్ కోసం అరగంట కేటాయించడం ప్రారంభించింది.

టీవీ9 ప్రధానంగా ఇటీవల కీసర ఎమ్మార్వోపై దాడి చేసిన సమయంలో…అక్కడ ఉన్న అంజిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో రేవంత్ రెడ్డికి సంబంధించిన డాక్యుమెంట్లు దొరికాయని..అవి ల్యాండ్ డీలింగ్స్‌కు సంబంధించినవి… చెప్పడం ప్రారంభించింది. ఏసీబీ అధికారులు మీడియాకు అలాంటి లీకులే ఇచ్చారు. అందుకే హిందూ లాంటి పత్రిక కూడా రేవంత్ రెడ్డి పేరు చెప్పకుండా.. ఆ మాటలను ప్రచురించేసింది. కానీ తర్వాత నిజం తెలుసుకుంది. ఎంపీ రేవంత్ రెడ్డి… సమాచారహక్కు చట్టం కింద తెలుసుకోవాలనుకున్నది కాలేజీలకు సంబంధించిన సమాచారమే కానీ… భూముల సమాచారం కాదని.. వివరణ కథనం కూడా ఇచ్చింది. అయితే.. టీవీ 9 మాత్రం అలాంటిదేమీ పట్టించుకోకుండా… వ్యక్తిగత దూషణలతో కథనాలు టెలికాస్ట్ చేసేస్తోంది.

రేవంత్ రెడ్డిని రాజకీయంగా దెబ్బకొట్టే కథనాలు కూడా.. ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రియాంక గ్రూప్‌లో చేరారని… దీని సారాంశం. ఈ ప్రచారం ఓ రేంజ్‌లో ఉండటంతో రేవంత్ రెడ్డి కూడా స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మొత్తానికి రేవంత్ రెడ్డిపై ఉన్నవీ.. లేనివీ రాసేసి.. ఆయనను పీసీసీ చీఫ్ పదవి వరకూ రాకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని… ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇందులో టీవీ9కి ఉన్న ప్రత్యేక ఆసక్తి ఏమిటో సులువుగానే అర్థం చేసుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close